Ponniyin Selvan: మణిరత్నం 40 ఏళ్ల కల... ‘పొన్నియిన్ సెల్వన్’
‘‘తెలుగు ప్రేక్షకులు 42 ఏళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్నారు. అదే ప్రేమని ఈ సినిమాపై చూపించండ’’ని కోరారు ప్రముఖ నటి సుహాసిని. ఆమె భర్త మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. జయం రవి, విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్కుమార్, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.
‘‘తెలుగు ప్రేక్షకులు 42 ఏళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్నారు. అదే ప్రేమని ఈ సినిమాపై చూపించండ’’ని కోరారు ప్రముఖ నటి సుహాసిని. ఆమె భర్త మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. జయం రవి, విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్కుమార్, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. సుభాస్కరన్ నిర్మాత. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో తొలి భాగం ‘పీఎస్1’గా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దిల్రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు కార్తి మాట్లాడుతూ ‘‘ఇలాంటి సినిమా చేసేటప్పుడే సినిమా ఎంత గొప్ప మాధ్యమమో గుర్తుకొస్తుంది. మణిరత్నం సర్ 40 ఏళ్ల కల ఈ సినిమా’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ ‘‘నాన్న, అపరిచితుడు... ఇలా ఒకొక్క సినిమాలో ఒకొక్క భావోద్వేగం నచ్చుతుంది. ఈ సినిమాలో గుర్రంపై వచ్చే ఒక్క షాట్ చాలు అనిపించింది’’ అన్నారు. సుహాసిని మాట్లాడుతూ ‘‘పెళ్లికి ముందు మణిరత్నం నాకొక బహుమానం ఇచ్చారు. చోళ హోటల్లోకి పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి ఐదు వాల్యూమ్స్ పొన్నియిన్ సెల్వన్ నవలలు ఇచ్చి చదివి, లైన్గా రాసి ఇవ్వు అన్నారు. ప్రతీ ఛాప్టర్ చదివి ఒకొక్క లైన్ రాసి ఇచ్చా. వన్ లైన్ ఆర్డర్ అంటే ఇలాగా రాసేది అన్నారు. పెళ్లి చేసుకోరేమో అనుకున్నా (నవ్వుతూ). 34 ఏళ్ల తర్వాత ఈ సినిమా చేశారు. దానికి కారణం సుభాస్కరన్. ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి’’ అన్నారు. ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ‘‘38 ఏళ్లుగా తెలుగులో పనిచేస్తున్నా. రమేష్నాయుడు, చక్రవర్తి, రాజ్ కోటి, సత్యం... ఇలా వీళ్లందరితో కలిసి చేసిన ప్రయాణంతో నా కెరీర్కి పునాదులు పడ్డాయి. భాష, కవిత్వం, గౌరవం.... వీటన్నిటికీ కృతజ్ఞతలు. ఈ సినిమా తర్వాత నేను ఓటీటీల్లో సిరీస్లు చూడటం మానేశాను. మన సంస్కృతి, మన రక్తం, మనవాళ్లు చేసిన సినిమా ఇది. గొప్పగా ఉంది’’ అన్నారు. ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ ‘‘సెల్యూటాయిడ్పై ఓ పెయింట్ని సృష్టించాం. మణిరత్నం కలకి జీవితాన్నిచ్చే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో త్రిష, కార్తి, జయం రవి, దిల్రాజు, శోభిత ధూళిపాళ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ