Ponniyin Selvan: మరో ‘బాహుబలి’ అవసరం లేదు: ‘పొన్నియిన్ సెల్వన్’ వేడుకలో కార్తి
‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా.. ‘బాహుబలి’లా ఉంటుందా? అని చాలామంది అడుగుతున్నారని, ఆ గొప్ప చిత్రం అందరికీ నచ్చిందని ఇప్పుడు మరో ‘బాహుబలి’ అవసరం లేదని నటుడు కార్తి అన్నారు.
హైదరాబాద్: ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా.. ‘బాహుబలి’లా ఉంటుందా? అని చాలామంది అడుగుతున్నారని, ఆ చిత్రం అందరికీ నచ్చిందని ఇప్పుడు మరో ‘బాహుబలి’ అవసరం లేదని నటుడు కార్తి అన్నారు. విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి తదితరులతో కలిసి ఆయన నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్-1’ (Ponniyin Selvan). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తి మాట్లాడారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లో నిర్వహించిన వేడుకకు విచ్చేసి, సందడి చేశారు.
వేడుకనుద్దేశించి కార్తి మాట్లాడుతూ.. ‘‘సినిమా ఎంత గొప్ప మాధ్యమమో ఇలాంటి కథల్లో నటించేటప్పుడు మరింత బాగా అర్థమవుతుంది. మణిరత్నంగారి కలల ప్రాజెక్టు ఇది. ‘ఇది బాహుబలి సినిమాలా ఉంటుందా?’ అని చాలామంది అడుగుతున్నారు. ‘బాహుబలి’ని మనం చూశాం, బాగా నచ్చింది. మనకు మరో ‘బాహుబలి’ అవసరం లేదు. భారతీయత గురించి చాటి చెప్పే ఎన్నో కథలున్నాయి. మన నేలపై పుట్టిన ఎందరో హీరోల గురించి చెప్పాల్సి ఉంది. అలా రూపొందిన చిత్రమే ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ సినిమాలో రొమాన్స్, అడ్వెంచర్, రాజకీయం.. ఇలా కోణాలున్నాయి. ఈ చిత్రంలో నటించటం గొప్ప వరంగా భావిస్తున్నా. ఎ. ఆర్. రెహమాన్ నాకు స్ఫూర్తి’’ అని కార్తి పేర్కొన్నారు.
‘‘మీరంతా (తెలుగు ప్రేక్షకులు) సినిమా పిచ్చోళ్లు. మణిరత్నంగారు చాలా అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులోని ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంది. అందుకే మేం ఇంతమంది కలిసి నటించాం. నాకెన్నో హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్గారికి ఈ వేదికగా మరోసారి ధన్యవాదాలు’’ అని విక్రమ్ అన్నారు.
‘‘42 ఏళ్లుగా నన్ను ఆదరించినట్టుగానే ఈ సినిమానీ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. మా పెళ్లికి ముందు మణిరత్నం నాకు ఊహించని బహుమతి ఇచ్చారు. అది ‘పొన్నియిన్ సెల్వన్’ పుస్తకాలున్న పెద్ద బ్యాగ్. వాటిని చదివి ఒక్క లైన్లో చెప్పమనేవారు. నా వంతు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. పెళ్లికాదేమో అనుకున్నా (నవ్వుతూ..). పెళ్లైన 34 సంవత్సరాల తర్వాత ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది తమిళంలో రూపొందిన సినిమానే అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే చిత్రీకరించాం. ఇది మీ సినిమా. మీరంతా ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలి. ఈ సినిమాలో నటించిన నటులు, సాంకేతిక నిపుణులు, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న దిల్రాజుగారికి థ్యాంక్స్. మణిరత్నం- రెహమాన్ల బంధాన్ని నిర్వచించటం కష్టం. ఈ సినిమాలో నందిని అనే పాత్ర పోషించిన ఐశ్వర్యరాయ్గారిని ప్రపంచం ప్రశంసించబోతోంది’’ అని సుహాసిని ప్రసంగించారు.
‘‘నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ థ్యాంక్స్. మణిరత్నంగారు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. విక్రమ్, కార్తి, జయం రవి, శరత్కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, త్రిషలాంటి నటులతో కలిసి పనిచేయటం మరిచిపోలేని జ్ఞాపకం. ఈ సినిమాని మీరంతా ఆనందిస్తారని ఆశిస్తున్నా. సుహాసినిగారితో నాకు మంచి అనుబంధం ఉంది’’ అని ఐశ్వర్యరాయ్ తన కెరీర్ను గుర్తు చేసుకున్నారు.
‘‘చాలా కాలం తర్వాత హైదరాబాద్ వచ్చా. మీ అందరినీ మళ్లీ కలవటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకనిర్మాతలు, తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న దిల్రాజుగారికి ధన్యవాదాలు’’ అని త్రిష అన్నారు.
‘‘38 ఏళ్ల క్రితం నా సంగీత ప్రయాణం తెలుగు సినిమాలతోనే మొదలైంది. రమేశ్నాయుడు, చక్రవర్తి, రాజ్-కోటి,సత్యం.. వీరందరి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నా. ఈ సినిమాని చూసి ఆనందించండి’’ అని రెహమాన్ అభిమానులకు చెప్పారు.
‘‘ఈ రోజుల్లో ఒక్క పెద్ద హీరోతో సినిమా చేయటమే చాలామందికి కష్టం. అలాంటిది ఇంతమంది అగ్ర తారలతో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలను తెరకెక్కించటం గొప్ప విషయం. 50 ఏళ్లనాటి కథని భారతీయ సినీ అభిమానులకు చూపించాలనుకోవటం అభినందనీయం. ఇప్పుడు ఫలానా భాష సినిమా అని లేదు. కంటెంట్ బాగున్న ప్రతి సినిమా అన్ని చోట్లా విజయం సాధిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’, ‘కార్తికేయ 2’లానే ‘పొన్నియిన్ సెల్వన్’ కూడా అద్భుతం సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. ఎ. ఆర్. రెహమాన్గారి గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఆయన్ను చూసి భారతీయులంతా గర్విస్తారు’’ అని దిల్ రాజు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.