Ponniyin Selvan: త్వరలోనే చోళులు వస్తున్నారు

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌-1’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలిపార్ట్‌ షూటింగ్‌ పూర్తైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది

Updated : 03 Jul 2022 06:54 IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం(Maniratnam) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌-1’ (Ponniyin Selvan). రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలిపార్ట్‌ షూటింగ్‌ పూర్తైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘‘త్వరలోనే చోళులు వస్తున్నారు’’ అనే వ్యాఖ్యని జోడించారు. చోళ సామ్రాజ్య పతాకం ఎగురుతున్నట్లు ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో విక్రమ్‌ (Vikram), కార్తి(Karthi), జయం రవి(jayam Ravi), ఐశ్వర్యరాయ్‌(Aishwarya rai), త్రిష(Trisha), శోభితా ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 30న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ ఇప్పటికే ప్రకటించింది. అందుకే ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని