Ponniyin Selvan: ఒక పాట.. 300మంది డ్యాన్సర్లు, 25 రోజుల షూటింగ్‌

టీజర్‌తోనే తన సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూపించారు అగ్ర దర్శకుడు మణిరత్నం (Mani Ratnam).

Published : 15 Jul 2022 02:05 IST

హైదరాబాద్‌: టీజర్‌తోనే తన సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూపించారు అగ్ర దర్శకుడు మణిరత్నం (Mani Ratnam). ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’(Ponniyin Selvan). విక్రమ్‌(Vikram), కార్తి (Karthi), జయం రవి (jayam ravi), ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai), త్రిష (Trisha) ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులోని ఓ పాట కోసం పది, ఇరవై కాదు ఏకంగా 300 మంది డ్యాన్సర్లను తీసుకున్నారట. ఇందులో 100మంది ముంబయికి చెందిన డ్యాన్సర్లు ఉన్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ‘ఈ పాట షూటింగ్‌కు 25 రోజులు పట్టింది. ఇందుకోసం ఆరేడు షెడ్యూల్స్‌ చేయాల్సి వచ్చింది. భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. త్వరలోనే దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఎవరూ చూడని స్థాయిలో ఈ పాట ఉంటుంది’ అని చిత్ర బృందానికి చెందిన కొందరు తెలిపారు.

దాదాపు రెండేళ్ల నుంచి షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని