Pooja Hegde: ప్రభాస్‌తో ‘బాహుబలి-3’ చేస్తా: పూజాహెగ్డే

‘రాధేశ్యామ్‌’ కోసం ప్రభాస్‌తో మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు నటి పూజాహెగ్డే. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు సొంతం చేసుకున్నప్పటికీ..

Published : 21 Mar 2022 01:18 IST

హైదరాబాద్‌: ‘రాధేశ్యామ్‌’ కోసం ప్రభాస్‌తో మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు నటి పూజాహెగ్డే. ఆన్‌స్క్రీన్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా చక్కగా కుదిరిందని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు పూజాహెగ్డే స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్‌, తదుపరి ప్రాజెక్ట్‌లపై స్పందించారు. ఇందులో భాగంగా ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ.. ఆయన మంచి వ్యక్తి అని అన్నారు.

‘‘ప్రభాస్‌ మంచి వ్యక్తి. ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మరలా ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉంది. ఒకవేళ నాకు ఛాన్స్‌ వస్తే ఆయన్ని ‘బాహుబలి -3’ చేయమని.. అందులో నన్నే హీరోయిన్‌గా తీసుకోమని చెప్తా. ఈ సినిమా విడుదలయ్యాక నాకు ఎంతో మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రేరణగా నా యాక్టింగ్‌ బాగుందని అందరూ చెప్పారు. ముఖ్యంగా విమర్శకులు సైతం నన్ను ప్రశంసిస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో కళ్లతోనే నేను పలికించిన భావాలు బాగున్నాయని చెబుతున్నారు. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది’’ అని పూజా తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని