Pooja Hegde: సల్మాన్‌ డ్యాన్స్‌పై మీమ్స్‌.. పూజాహెగ్డే రియాక్షన్‌

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) డ్యాన్స్‌పై ఇటీవల సోషల్‌మీడియాలో వచ్చిన మీమ్స్‌పై నటి పూజాహెగ్డే (Pooja Hegde) స్పందించారు. కొంతమంది సరదాగా మీమ్స్‌ క్రియేట్‌ చేశారని అవి చూసి తాను ఎంతగానో నవ్వుకున్నానని అన్నారు.

Published : 19 Apr 2023 19:45 IST

ముంబయి: బాలీవుడ్‌ బాద్‌షా సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), నటి పూజాహెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ki Bhai Kisi Ka Jaan). ‘వీరమ్‌’, ‘కాటమరాయుడు’ చిత్రాలకు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పూజాహెగ్డే బిజీ బిజీగా పాల్గొంటున్నారు. ఒకే రోజు పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె సల్మాన్‌ డ్యాన్స్‌పై వచ్చిన మీమ్స్‌ గురించి స్పందించారు.

‘‘మా సినిమా నుంచి ‘NAIYO LAGDA’ పాటను విడుదల చేసినప్పుడు దానిపై కొంతమంది మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. వాటిని చూసి నేను ఎంతో నవ్వుకున్నాను. మనుషులు స్పీడ్‌ అయిపోయారనిపించింది. పాట విడుదలైన వెంటనే దానిపై మీమ్స్‌ క్రియేట్‌ చేసేస్తున్నారు’’ అని పూజా వివరించారు. అనంతరం సోషల్‌మీడియాలో వచ్చే విమర్శలపై స్పందిస్తూ.. ‘‘నేను సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాను. నెట్టింట ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. నాపై వచ్చే విమర్శలు, ట్రోల్స్‌ కూడా చదువుతుంటాను. అయితే నేను విమర్శలన్నింటినీ ఒకేలా చూడను. కొంతమంది కావాలని నెగెటివ్‌గా కామెంట్స్‌ చేస్తారు. వాటిని నేను పట్టించుకోను. నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాను. అలాగే, నేను అందర్నీ సంతోష పెట్టలేను. నాలానే ఉంటూ ముందుకు సాగుతుంటాను’’ అని పూజా వివరించారు. ఇదే కార్యక్రమంలో ఆమె మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమాపై మాట్లాడారు. SSMB 28లో మహేశ్‌ను కొత్త అవతార్‌లో చూసేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు.

సల్మాన్‌ - పూజాహెగ్డేలపై చిత్రీకరించిన ‘NAIYO LAGDA’ పాటను ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల చేశారు. ప్రస్తుతం ఇది 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. అయితే, ఈపాట విడుదలైనప్పుడు.. సల్మాన్‌ డ్యాన్స్‌పై ఎన్నో మీమ్స్‌ వచ్చాయి. కొరియోగ్రఫీ బాలేదని విమర్శలు కూడా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని