Pooja Hegde: పూజా.. కొత్తింటి సంబరం

‘‘కల నెరవేరింది’’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది నటి పూజా హెగ్డే. ముంబయిలోని తన కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఆమె ఈ ట్వీట్‌ చేసింది.

Updated : 23 Jan 2022 06:55 IST

‘‘కల నెరవేరింది’’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది నటి పూజా హెగ్డే. ముంబయిలోని తన కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఆమె ఈ ట్వీట్‌ చేసింది. కొన్ని నెలల క్రితమే పూజా ముంబయిలో కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అక్కడి సముద్ర తీరానికి ఎదురుగా ఆధునిక హంగులతో ఎంతో విలాసవంతంగా ఈ ఇంటిని ముస్తాబు చేయించుకుంది. ఇప్పుడా ఇంటి నిర్మాణం పూర్తవడంతో.. కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేసింది పూజా. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘‘కలలన్నీ నెరవేరినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. కష్టపడి పని చేయండి. అప్పుడు ఈ విశ్వం మీ  మొండి హృదయంతో ప్రేమలో పడుతుంది’’ అంటూ ఆ ఫొటోలకు ఓ స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యను జోడించింది పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త చిత్రంలో నటించనుంది. అలాగే పవన్‌ కల్యాణ్‌కు జోడీగా ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ సినిమాలోనూ కనిపించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని