Pooja Hegde: కేన్స్‌ వెళ్లనున్న పూజాహెగ్డే

కథానాయిక పూజాహెగ్డే ప్రఖ్యాత కేన్స్‌ చలన చిత్రోత్సవంలో సందడి చేయనుంది. ఆమె ఈసారి భారతదేశ  తరఫున పాల్గొననుంది. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం అందింది. సినిమాల ప్రదర్శనతోపాటు, భిన్న

Updated : 12 May 2022 09:04 IST

కథానాయిక పూజాహెగ్డే ప్రఖ్యాత కేన్స్‌ చలన చిత్రోత్సవంలో సందడి చేయనుంది. ఆమె ఈసారి భారతదేశ  తరఫున పాల్గొననుంది. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం అందింది. సినిమాల ప్రదర్శనతోపాటు, భిన్న సంస్కృతులు, ఫ్యాషన్‌ మేళవింపుగా సాగే చలన చిత్రోత్సవం ఇది. ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొణె, కంగన రనౌత్‌, సోనమ్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా తదితర తారలు ఇదివరకు ఈ చిత్రోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే 2022 కేన్స్‌ చిత్రోత్సవం కోసం ఫ్రాన్స్‌ వెళుతున్న పూజా... పలు దేశాల నుంచి వచ్చిన తారలతో కలిసి రెడ్‌ కార్పెట్‌పై హొయలు పోనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో వెలుగుతున్న కథానాయికల్లో పూజా ఒకరు. ఆమె దక్షిణాదితోపాటు, హిందీలోనూ వరుసగా అవకాశాలు అందుకొంటోంది. సల్మాన్‌ఖాన్‌తో కలిసి ‘కభీ ఈద్‌ కభీ దీపావళి’లో నటిస్తోంది. తెలుగులోనూ మరోసారి మహేష్‌తో కలిసి నటించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు