Pooja Hegde: అడుగులు పడనున్నాయ్‌ మహేష్‌ సినిమా సెట్లోకి

మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాపై పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ఏడాది ఆమెకు ఆశించినంతగా విజయాలు రాలేదు.

Updated : 10 Dec 2022 06:55 IST

మహేష్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాపై పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ఏడాది ఆమెకు ఆశించినంతగా విజయాలు రాలేదు. ఆమె నటించిన ‘రాధేశ్యామ్‌’, ‘బీస్ట్‌’, ‘ఆచార్య’ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీనికి తోడు పవన్‌ కల్యాణ్‌తో చేయాల్సిన ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సందిగ్ధంలో పడగా.. విజయ్‌ దేవరకొండతో చేయాల్సిన ‘జనగణమన’ ఆగిపోయింది. దీంతో ఇప్పుడామె చూపంతా తన చేతిలో ఉన్న మహేష్‌బాబు చిత్రంపైనే ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. కాగా, పూజా ఈ చిత్ర సెట్లోకి ఈనెల 15న అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. మహేష్‌ అదే రోజున లేదంటే మరుసటి రోజున చిత్రీకరణలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పూజా ప్రస్తుతం హిందీలో ‘సర్కస్‌’, ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని