Cinema News: రామోజీ ఫిల్మ్సిటీలో బాలకృష్ణ... ప్రభాస్ చిత్రాలు
అగ్ర తారల సినిమాలకు చిరునామాగా మారింది రామోజీ ఫిల్మ్సిటీ. ఓ వైపు సెట్స్ పనులు... మరోవైపు చిత్రీకరణలతో బిజీ బిజీగా గడుపుతున్నాయి ఆయా చిత్రబృందాలు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, ప్రభాస్ చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.
అగ్ర తారల సినిమాలకు చిరునామాగా మారింది రామోజీ ఫిల్మ్సిటీ. ఓ వైపు సెట్స్ పనులు... మరోవైపు చిత్రీకరణలతో బిజీ బిజీగా గడుపుతున్నాయి ఆయా చిత్రబృందాలు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, ప్రభాస్ చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయిక. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్సిటీలో ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్ని తీర్చిదిద్దారు. అక్కడే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు మొదలుకొని, మరికొంత టాకీభాగాన్ని ఈ షెడ్యూల్లో తెరకెక్కిస్తున్నామని, ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటోందని సినీ వర్గాలు చెప్పాయి. నిజ జీవిత ఘటనలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ పతాకంపై ‘ప్రాజెక్ట్ కె’ తెరకెక్కుతోంది. దీపికా పదుకొణే కథానాయిక. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో తీర్చి దిద్దిన సెట్స్లో జరుగుతోంది. సింహభాగం సన్నివేశాల్ని ఇక్కడే తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు