Cinema News: రామోజీ ఫిల్మ్‌సిటీలో బాలకృష్ణ... ప్రభాస్‌ చిత్రాలు

అగ్ర తారల సినిమాలకు చిరునామాగా మారింది రామోజీ ఫిల్మ్‌సిటీ. ఓ వైపు సెట్స్‌ పనులు... మరోవైపు చిత్రీకరణలతో బిజీ బిజీగా గడుపుతున్నాయి ఆయా చిత్రబృందాలు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, ప్రభాస్‌ చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.

Updated : 14 Apr 2022 09:21 IST

గ్ర తారల సినిమాలకు చిరునామాగా మారింది రామోజీ ఫిల్మ్‌సిటీ. ఓ వైపు సెట్స్‌ పనులు... మరోవైపు చిత్రీకరణలతో బిజీ బిజీగా గడుపుతున్నాయి ఆయా చిత్రబృందాలు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, ప్రభాస్‌ చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్‌ని తీర్చిదిద్దారు. అక్కడే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు మొదలుకొని, మరికొంత టాకీభాగాన్ని ఈ షెడ్యూల్‌లో తెరకెక్కిస్తున్నామని, ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటోందని సినీ వర్గాలు చెప్పాయి. నిజ జీవిత ఘటనలతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై ‘ప్రాజెక్ట్‌ కె’ తెరకెక్కుతోంది. దీపికా పదుకొణే కథానాయిక. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో తీర్చి  దిద్దిన సెట్స్‌లో జరుగుతోంది. సింహభాగం సన్నివేశాల్ని ఇక్కడే తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని