Prabhas: ‘మిర్చి’ లుక్‌లో ప్రభాస్‌.. కింగ్‌ ఆఫ్‌ ట్రాన్సఫర్మేషన్‌ అంటోన్న ఫ్యాన్స్‌

పాన్‌ఇండియా హీరో ప్రభాస్‌ లుక్‌ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ‘సాహో’ తర్వాత ఆయన లుక్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని...

Updated : 15 Jun 2022 15:06 IST

వీడియో, ఫొటోలు వైరల్‌

ముంబయి‌: పాన్‌ఇండియా హీరో ప్రభాస్‌ లుక్‌ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ‘సాహో’ తర్వాత ఆయన లుక్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని ఇటు అభిమానులు అటు పలువురు సినీ ప్రియులు చెప్పుకొన్నారు. కాగా, తాజాగా ఆయన లుక్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన్ని చూసి విమర్మించిన వారే ఇప్పుడు ‘కింగ్‌ ఆఫ్‌ ట్రాన్సఫర్మేషన్‌’ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన లేటస్ట్ లుక్‌ ఎలా బయటకు వచ్చిందంటే..

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా, ఇక, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ‘ఆదిపురుష్‌’తోపాటు ప్రభాస్‌ నటిస్తోన్న మరో చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా లేటస్ట్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. దీని కోసం సన్నద్ధమవుతోన్న ప్రభాస్‌ గత కొన్నిరోజుల నుంచి మీడియా ముందుకు రాలేదు. ఈక్రమంలోనే ఆయన ముంబయిలోని ఓంరౌత్‌ నివాసంలో జరిగిన ఓ పార్టీలో తాజాగా పాల్గొన్నారు. ‘ఆదిపురుష్‌’ టీమ్‌ సైఫ్‌, కృతిసనన్‌ సైతం ఇందులో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాగా వాటిని చూసిన నెటిజన్లు.. ‘‘ప్రభాస్‌ని చూస్తుంటే మిర్చి లుక్‌ గుర్తుకొస్తోంది’’, ‘‘లుక్‌తో ప్రభాస్‌ అన్న అదరగొట్టేశారు’’, ‘‘ప్రభాస్‌ అన్నా.. కింగ్ ఆఫ్‌ ట్రాన్సఫర్మేషన్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని