adipurush: హైదరాబాద్‌లో షూటింగ్‌?

ప్రభాస్ కథానాయకుడిగా భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం  ‘ఆదిపురుష్‌’. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఇందులో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్‌ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. సన్నీ సింగ్‌ లక్ష్మణగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Published : 08 May 2021 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్ కథానాయకుడిగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్‌ రావణ్ పాత్రలో నటిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్కడ కొంతమేర షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా కరోనా వైరస్ రెండో దశతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది.. దీంతో వెండితెర, బుల్లితెరకు చెందిన షూటింగ్‌లు ఆగిపోయాయి. మరికొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో చిత్ర బృందం హైదరాబాద్‌లో షూటింగ్‌ చేయాలని భావిస్తోందట.

ఇందుకోసం త్వరలోనే చిత్రబృందం హైదరాబాద్‌ చేరుకోనుందనే వార్తలొస్తున్నాయి. అయితే  ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ధ్రువీకరించలేదు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన 60 రోజుల పాటు ముంబయిలో చిత్రీకరణ జరుపుకొంది. ఇంకా 90 రోజుల పాటు షూటింగ్‌ జరుపుకోవాల్పి ఉంది. ‘ఆదిపురుష్‌’ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది. టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రానికి భూషణ్ కుమార్‌, కిషన్‌ కుమార్‌ నిర్మాతలు. రూ.500 కోట్ల బడ్జెట్ నిర్మితమవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న తెరపైకి రానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని