Prasanth Neel: ఎన్టీఆర్‌ నేనూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌: ప్రశాంత్‌ నీల్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే తనకెంతో ఇష్టమని దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ అన్నారు. ‘కేజీయఫ్‌’తో కన్నడ చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఆయన ప్రస్తుతం...

Published : 11 Apr 2022 15:54 IST

బెంగళూరు: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే తనకెంతో ఇష్టమని దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ అన్నారు. ‘కేజీయఫ్‌’తో కన్నడ చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఆయన ప్రస్తుతం తెలుగు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేందుకు వరుస ప్రాజెక్ట్‌లు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌తో ‘సలార్‌’ పట్టాలెక్కించిన ఆయన తారక్‌తో మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యశ్‌ హీరోగా సిద్ధమైన ‘కేజీయఫ్‌-2’ ప్రమోషన్స్‌లో ప్రశాంత్‌నీల్‌ బిజీగా పాల్గొంటున్నారు. ‘కేజీయఫ్‌’ సీక్వెల్‌గా రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ కన్నడ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘ప్రస్తుతానికి నా చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఒకటి ప్రభాస్‌తో రూపొందిస్తున్న ‘సలార్‌’. మరొకటి ఎన్టీఆర్‌ సినిమా. నా దృష్టి మొత్తం ఆ రెండు ప్రాజెక్ట్‌లపైనే ఉంది. ఇవి రెండు కాకుండా మురళీతో ఓ సినిమా చేయాలనుకుంటున్నా. అలాగే యశ్‌తో మరోసారి టీమ్‌ అప్‌ కావాలని భావిస్తున్నా’’ అని ప్రశాంత్‌నీల్‌ తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌ 31 ప్రాజెక్ట్‌ గురించి ప్రశాంత్‌ స్పందిస్తూ.. ‘‘సుమారు 15 , 20 ఏళ్ల నుంచి నేను ఎన్టీఆర్‌కు అభిమానిని.  ప్రాజెక్ట్‌ చేయాలని నిర్ణయించుకోకముందే మేమిద్దరం సరదాగా 15 సార్లు కలిశాం. గడిచిన రెండేళ్ల కాలంలో మేమిద్దరం క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోయాం. నేను చెప్పిన కథ తారక్‌కు బాగా నచ్చింది. ప్రస్తుతం దానిపైనే వర్క్‌ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని