NTR: ‘ఎన్టీఆర్‌ 30’.. పనులు చకచకా..

కథానాయకుడు ఎన్టీఆర్‌.. దర్శకుడు కొరటాల శివ కలయికలో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే.

Updated : 07 Nov 2022 07:58 IST

కథానాయకుడు ఎన్టీఆర్‌.. దర్శకుడు కొరటాల శివ కలయికలో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో పూర్వ నిర్మాణ పనుల్ని చకచకా పూర్తి చేస్తోంది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించే ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌, ఛాయాగ్రాహకుడు రత్నవేలుతో కలిసి కొరటాల కసరత్తులు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలియజేశాయి. ఈ మేరకు ఈ ముగ్గురు కలిసి చర్చిస్తున్న ఫొటోలను ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘ఎన్టీఆర్‌ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తిమంతమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ కథపై చిత్ర బృందమంతా నమ్మకంతో ఉంది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది’’ అని సినీవర్గాలు తెలిపాయి. సంగీతం: అనిరుధ్‌, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని