Priyadarshi: ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నల్లగా ఉన్నాడు అనే వాళ్లు...: ప్రియదర్శి
తనదైనశైలిలో కామెడీ చేసి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. చిన్నపాత్రతో సినీరంగ ప్రవేశం చేసి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఈ యంగ్ యాక్టర్ చెప్పలని ఉంది కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
టెర్రర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’లో ‘నా చావు నేను చస్తా’ అనే ఒక్క డైలాగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (ప్రియదర్శి పులికొండ). పెద్ద హీరోలతోనూ కలిసి నవ్వుల్ని పంచుతూ.. ఆరోగ్యకరమైన కామెడీని ఇస్తూ అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘మల్లేశం’ లాంటి సినిమాల్లో తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరి ప్రియదర్శి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో పంచుకున్న విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
సినిమాటోగ్రాఫర్ అవుదామని వచ్చారా ఇండస్ట్రీకి?
ప్రియదర్శి: సినిమాల్లోకి వెళతాను అంటే మా ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. అందుకే కెమెరా వర్క్ నేర్చుకుంటాను. సినిమాటోగ్రాఫర్గా అవకాశాలు వస్తాయని ఇంట్లో చెప్పాను. ఎలా అయినా ఇండస్ట్రీకి రావాలని వచ్చాను. 2014లో శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ సినిమాలోని పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వాళ్లు మొదట నన్ను తీసుకోలేదు. కానీ తర్వాత ఆ పాత్రకు నేనే సరిపోతాననిపించి నన్ను పిలిచారు.
పెళ్లిచూపులు తర్వాత వెనక్కి తిరిగి చూడలేదనుకుంటా..? మీరు యాక్టింగ్ భిక్షుగారి దగ్గర నేర్చుకున్నారట?
ప్రియదర్శి: అవును, ఆ పెళ్లిచూపులు సినిమాతో నా కెరీర్లో చాలా మార్పు వచ్చింది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. నేను తనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేస్తున్నావ్? అని అడగను.. ఏం చేయట్లేదు అని అడుగుతాను. ఇక యాక్టింగ్ విషయానికొస్తే నాకు చిన్నప్పటి నుంచే భిక్షుగారు తెలుసు. మేము చేసిన ఓ షార్ట్ఫిల్మ్ ఆయనకు చూపించాను. ఆయన సింపుల్గా ‘నువ్వు యాక్టింగ్ బాగా చేయట్లేదు’ అని చెప్పేశారు. ‘ఇంటికి రా నేను నేర్పిస్తాను’ అన్నారు. అందరూ నా నటన బాగుందని మెచ్చుకుంటుంటే ఆయన అలా అన్నారేంటని ఆలోచించాను. కానీ ఆయన నాకు నటనలో చాలా నేర్పించారు.
మల్లేశం లాంటి గొప్ప సినిమా చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు?
ప్రియదర్శి: ఆ సినిమాకు సంబంధించిన కథ తెలుసుకున్న తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యా. ఈ సినిమా చేయడానికి మొదట భయపడ్డాను. కానీ నా పాత్రను చూసి చాలామంది ప్రశంసించారు. ఆ సినిమా తర్వాతే చాలా మంది చేనేత కుటుంబాల గురించి తెలుసుకున్నారు.
పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి చేయడం ఎలా అనిపించింది?
ప్రియదర్శి: పెళ్లిచూపులు సమయంలో అందరం ఎలా అయినా మేమేంటో నిరూపించుకోవాలి అనే తపనతో ఉన్నాం. పెళ్లిచూపులు సినిమా అంత విజయం సాధించిందంటే ఆ క్రెడిట్ అంతా తరుణ్ భాస్కర్కే దక్కుతుంది. తరుణ్ ఒక ఆర్టిస్టులో ఉన్న ప్రతిభను గుర్తిస్తారు. విజయ్ నాకు మంచి ఫ్రెండ్.
మహేశ్ బాబు, ఎన్టీఆర్, వెంకటేశ్లతో చేయడం ఎలా ఉంది?
ప్రియదర్శి: నన్ను చూసి మహేశ్బాబు గారు పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. నువ్వా..! అని ప్రేమగా పలకరించారు. మహేశ్ సినిమాల్లో ఎంత కామెడీ చేస్తారో కెమెరా వెనక కూడా అలానే ఉంటారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి నటించాను. తారక్తో మూడు రోజుల షూట్. నాకు భయంగా ఉండేది ఆయనతో చేయడం. ఎన్టీఆర్ నాతో రిహర్సల్స్ చేసేవారు. అప్పుడు భయం పోయింది. అలాంటి పెద్ద యాక్టర్ నాలాంటి చిన్న యాక్టర్లతో సమయం గడపడం చాలా ఆనందంగా అనిపించింది. వెంకటేశ్ గారు కూడా అంతే చాలా సింపుల్గా ఉంటారు. ప్రస్తుతం రామ్చరణ్తో కలిసి నటిస్తున్నా.
ఓటీటీ మీకు కలిసోచ్చిందా?
ప్రియదర్శి: నా కెరీర్ మొదలైందే షార్ట్ఫిల్మ్స్తోనే. నాకు ఓటీటీల పవర్ ఏంటో బాగా తెలుసు. సినిమా థియేటర్లకు ఏమాత్రం తీసిపోవని నాకు అర్థమైంది. ఆ తర్వాత కొవిడ్ వచ్చింది. అందరూ ఇళ్లలో కూర్చొని ఓటీటీలను బాగా చూశారు. ఆ సమయంలో నాకు మల్లేశం సినిమా అవకాశం వచ్చింది. చాలా మంది పెద్ద హీరోలు కూడా కలిసినప్పుడు చాలా బాగా చేస్తున్నావు అని ప్రోత్సహిస్తారు.
కొన్ని పాత్రలు కొందరికే సరిపోతాయి అంటారు. మరి ప్రియదర్శికి ఎలాంటి పాత్రలు సరిపోతాయి?
ప్రియదర్శి: ‘నేను ఇలాంటి పాత్రలే చేయాలి’ అని ప్రణాళికలు ఏవీ వేసుకోలేదు. ఎవరు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేసుకుంటూ వెళిపోతున్నా అంతే. నిర్మాతలు, దర్శకులు, హీరోలు వాళ్లందరూ నన్ను నమ్మి నాకు అవకాశం ఇస్తారు. నేనెప్పుడూ నా పరిధిని నిర్ణయించుకోలేదు. నేను పెళ్లి చూపులు సినిమా చేశాక రవివర్మ గారు ‘నువ్వు కమెడియన్ అని నేను అనుకోను. నువ్వు మంచి టైమింగ్ ఉన్న నటుడివి’ అన్నారు. అది మర్చిపోలేని ప్రశంస.
ఇటీవల విడుదలైన ఒకే ఒక జీవితం సినిమాలో వెన్నెల కిషోర్తో కలిసి నటించారు కదా.. ఎలా అనిపించింది?
ప్రియదర్శి: వెన్నెల కిషోర్ అన్నని చూశాక నేను కమెడియన్ని కాదని నాకు అర్థమైంది. బ్రహ్మనందం, వెన్నెల కిషోర్ వీళ్లందరూ లెజెండ్స్. నిజమైన హాస్యనటులు. వెన్నెల కిషోర్ అన్నకు సాహిత్యం మీద పట్టు ఉంది. ఆయన మంచి రచయిత.
మీ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్లు. మీరు నటనవైపు వచ్చారు. వాళ్ల నుంచి ఒత్తిడి ఉంటుందా? ఖాళీ టైమ్లో ఏం చేస్తారు?
ప్రియదర్శి: వాళ్ల నుంచి ఒత్తిడి కంటే సపోర్టు నాకు బాగా ఉంది. నేను చేయగలను అనే నమ్మకం ఉన్నా కూడా వాళ్ల భయాలు వాళ్లకు ఉంటాయి కదా. నాకు కొత్త ప్రాంతాలకు వెళ్లడం చాలా ఇష్టం. ఖాళీ దొరికితే కొత్త ప్రాంతాలకు వెళతాను.
ఏయే దర్శకులతో పని చేయాలని ఉంది?ఏ సినిమా అంటే ఇష్టం?
ప్రియదర్శి: అలా నేను చెప్పలేను. నాకు నచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్లతో పని చేయాలని ఉందని వాళ్లని కలిసినప్పుడు చెప్పాను. చాలా మంది దర్శకులు నాకు తెలుగు నేర్పించారు. విశ్వనాథ్గారు, బాలచందర్గారు, రామ్గోపాల్ వర్మ గారు ఇలా చాలామంది మన తెలుగు సినిమాకు ఎంతో చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు ఎన్ని హిందీ సినిమాలు తీశారో. ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్స్ ఉన్నారు. కానీ గతంలో పాన్ ఇండియా డైరెక్టర్లు ఉండేవాళ్లు. నాకు సాగర సంగమం, స్వయంకృషి, పుష్పక విమానం, భైరవద్వీపం, చంటి ఇలాంటి సినిమాలంటే ఇష్టం.
తెలుగు మీద ఎంతైతే పట్టు ఉందో ఇంగ్లిషులోనూ అలానే మాట్లాడతారని విన్నాం. నిజమేనా?
ప్రియదర్శి: నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టే నేను ఇంగ్లిషు మాట్లాడగలను. దానికి ఒక లాజిక్ ఉంది. నేను ఏభాషలో మాట్లాడాలన్నా తెలుగులోనే ఆలోచించుకుంటా అందుకే బాగా మాట్లాడగలుగుతాను అని నేను నమ్ముతాను.
టాలీవుడ్లో చేస్తూ.. టాలీవుడ్ అనే పదం నచ్చదు అని చెప్పారట?
ప్రియదర్శి: నేను చాలాసార్లు గమనించా. ఇండియన్ సినిమా అనగానే బాలీవుడ్ అంటారు. హిందీ సినిమాలు కాకుండా మిగతా అన్నింటినీ కలిపి రీజనల్ సినిమాలు అంటారు. నాకు ఇలా అనడం నచ్చేదికాదు. మనవి భాషాపరమైన రాష్ట్రాలు.. సినిమాలు అంతే. అందుకే ఏ భాష పేరు చెప్పి ఆ సినిమా అని పిలవాలి. తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు అని పిలవాలి అంతే కానీ అన్నింటినీ కలిపి రీజనల్ సినిమాలు అంటే నచ్చదు.
జాతిరత్నాలు గురించి చెప్పండి?
ప్రియదర్శి: జాతిరత్నాలు సినిమా కథ చెప్పడానికి దర్శకుడు వచ్చినప్పుడు నేను ఒక 10 నిమిషాలు నవ్వుతూనే ఉన్నాను. అశ్వనీదత్ బ్యానర్లో సినిమా చేయడం నా కల. జాతిరత్నాలుతో అది నెరవేరింది. ఆ సినిమాని ఇక్కడ శాంతి థియేటర్లో చూసినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో. విదేశాల్లో చూసినప్పుడు అక్కడ కూడా అంతమంది జనాలు ఉన్నారు.
మీ జీవితంలో విమర్శలను ఎదుర్కోలేదా?
ప్రియదర్శి: చాలా సార్లు ఎదుర్కొన్నా. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నల్లగా, సన్నగా ఉన్నాడు, మొటిమలు ఎక్కువ ఉన్నాయి. హీరో కంటే పొడుగ్గా ఉన్నాడు అనే వాళ్లు. అలా అన్నప్పుడల్లా నన్ను నేను ప్రొత్సహించుకునే వాడిని.
మీది ప్రేమ పెళ్లి కదా?
ప్రియదర్శి: అవును, తన పేరు రిచా. వాళ్లది ఆగ్రా. కాలేజీలో ఆమె నా సీనియర్. మా ప్రేమ గురించి చెప్పగానే ఇంట్లో వాళ్లు వెంటనే ఓకే అన్నారు. ఆమె మంచి రచయిత. తను రాసిన చాలా రచనలు ప్రచురించారు.
భవిష్యత్తులో మరొకసారి బయోపిక్లో నటించే అవకాశం వస్తే.. ఎవరిది చేయాలని కోరుకుంటారు?
ప్రియదర్శి: కొమరంభీం. ఆయన కథని చేయాలని ఉంది. కాళోజీ జీవిత చరిత్ర కూడా చేయాలని ఉంది. అలాగే రామోజీరావు గారి జీవితచరిత్ర సినిమాగా తీస్తే అందులో నటించాలని ఉంది. ఆయన గొప్ప వ్యక్తి. శాంతా బయోటెక్ వరప్రసాద్ గారి బయోపిక్ చేయాలని ఉంది. నేను చేయాలని కాదు.. వీళ్ల జీవితచరిత్రలు ప్రజలకు తెలియాలి. ఎవరు నటించినా చూసి సంతోషిస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు