పెళ్లయిన మూడు రోజులకే షూటింగ్కు వెళ్లా!
అందం, అభినయం కలగలిస్తే సుందరమ్మ... విప్లవ పాత్రతోనైనా మెప్పించగలిగే భారతక్క... నటన, సౌందర్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసే సినీ నటి ప్రియమణి. ఆమె త్వరలో ‘విరాట పర్వం’, ‘నారప్ప’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లాక్డౌన్ సమయం, చేస్తున్న సినిమాలు,
అందం, అభినయం కలగలిస్తే సుందరమ్మ... విప్లవ పాత్రతోనైనా మెప్పించగలిగే భారతక్క... నటన, సౌందర్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసే సినీ నటి ప్రియమణి. ఆమె త్వరలో ‘విరాట పర్వం’, ‘నారప్ప’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లాక్డౌన్ సమయం, చేస్తున్న సినిమాలు, వెబ్సిరీస్ల విశేషాలను ‘ఈనాడు సినిమా’తో పంచుకుందిలా..
* నేను ‘విరాటపర్వం’లో భారతక్క పాత్ర కోసం ఎలాంటి హోంవర్క్ చేయలేదు. ఒక మాజీ నక్సలైట్ దగ్గర శిక్షణ తీసుకున్నాఅనేది అవాస్తవం. ఒక నక్సలైట్గా నేను ఎలా ఉండాలి? వాళ్ల దగ్గర ఎలాంటి వస్తువులు ఉంటాయనేది దర్శకుడే నిర్ణయించారు. మేము కొన్ని సలహాలు ఇచ్చామంతే. వాటి ఆధారంగానే నా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. ‘నారప్ప’లోనూ చాలా బలమైన పాత్ర పోషిస్తున్నా. ఇందులోనూ చిన్న యాక్షన్ సన్నివేశం ఉంటుంది. ఈ సినిమాల చిత్రీకరణ ఇంకా పూర్తవ్వలేదు. ఈ లాక్డౌన్ సమయంలో నేను కథలైతే వింటున్నా. షూటింగ్ ప్రారంభించేవరకు ఆ వివరాలు చెప్పలేను.
* చిత్రపరిశ్రమలో ఒకప్పుడు వివక్ష ఉండేది. క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. కాజల్, తమన్నా, నయనతార, సమంత లాంటి వారు వాళ్ల మార్కెట్ను బట్టి పారితోషికం తీసుకుంటున్నారు. దీనికి నేను సంతోషిస్తున్నా. నాకు డబ్బు మీద అంత ఆశ లేదు. ప్రస్తుతం నాకిచ్చే పారితోషికం విషయంలో సంతృప్తిగా ఉన్నా.
* నాకు మంచి భర్త, కుటుంబం దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నా. పెళ్లయ్యాక మూడు రోజులకే నేను షూటింగ్కు వెళ్లా. కుటుంబం నుంచి అంత గొప్ప మద్దతు ఉంది కాబట్టే నేను కెరీర్లో రాణించ గలుగుతున్నా. కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజుల తరువాత మూడు నెలల పాటు నా భర్తతో గడిపా. నా ముంబయి డేట్స్ అన్ని మా ఆయనే చూసుకుంటున్నారు.
* ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో మనోజ్బాజ్పాయ్కు భార్యగా నటిస్తున్నా. ఇందులోని పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సిరీస్లో నాకు, సమంతకు మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఆమె విభిన్నంగా కనిపించబోతోంది. ఆమె పాత్ర గురించి ఒక లైన్ విన్నా. అది అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనిపించింది. అంతేకాదు ఇటీవల ‘అతిథి’ అనే హారర్ థ్రిల్లర్ మూవీలో నటించా. దీన్ని హాలీవుడ్ స్టైల్లో తీశారు. థియేటర్లో విడుదల చేయాల్సింది, కరోనా కారణంగా డిజిటల్ వేదికపై ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
* రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ప్రతికూల ఛాయలున్న పాత్రలో కనిపించాలనేది నా కోరిక. కన్నడలో ‘ధ్వజ’ అనే సినిమాలో కొంచెం అలాంటి పాత్రలో కనిపించా. ఒక పూర్తి స్థాయి కామెడీ చిత్రమూ చేయాలని ఉంది.
* భగవంతుడు మూడు నెలల సెలవులు ఇచ్చాడు. వంట తప్ప, ఇంట్లో అన్ని పనులు చేశా. సినిమాలు, సిరీస్లు చూశా. అయినా ఎన్ని రోజులు ఖాళీగా కూర్చుంటాం. రియాలిటీ షోల చిత్రీకరణ ప్రారంభమయ్యింది. ఇప్పుడు కొంచెం పని దొరుకుతుంది. సినిమాలు ఇప్పుడే ప్రారంభం కావు. రియాలిటీ షోలు చేసినా, వెబ్ సిరీస్ల్లో నటించినా, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పని పనే. మలయాళంలో రియాలిటీ షో చేయడానికి ఒప్పుకొన్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.