Priyanka Chopra: ప్రియాంక రాకతో కొత్త చిత్రాల పరుగులు

హాలీవుడ్‌లో జోరు పెంచిన ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టారు.

Updated : 02 Nov 2022 08:59 IST

హాలీవుడ్‌లో జోరు పెంచిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) మూడేళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టారు. వస్తూనే బాలీవుడ్‌లో చేయాల్సిన పాత ప్రాజెక్టులు, కొత్త సినిమాల చర్చలను పరుగులు పెట్టిస్తున్నారు. పీసీ గతంలోనే దర్శకులు విశాల్‌ భరద్వాజ్‌, సంజయ్‌లీలా భన్సాలీలతో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. త్వరలోనే ముంబయిలో వీళ్లతో కథా చర్చలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత కవి, పాటల రచయిత సాహిర్‌ లూథ్వానీ జీవితం ఆధారంగా భన్సాలీ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఆయన కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ సినిమాలో ప్రియాంక కథానాయిక పాత్ర పోషించే అవకాశాలున్నాయని సమాచారం. కత్రినా కైఫ్‌, అలియా భట్‌లతో కలిసి ఒక లేడీ మల్టీస్టారర్‌ చిత్రంలో నటించనున్నానని ఆమె 2021లోనే ఇన్‌స్టాలో ప్రకటించారు. ముగ్గురు కలిసి ఉన్న ఓ ఫొటో సైతం పంచుకున్నారు. కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టు ‘జీ లే జరా’ 2023లో పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఫర్హాన్‌ అక్తర్‌ దీనికి దర్శకుడు. రోడ్‌ట్రిప్‌ కథాంశం ఆధారంగా ఈ  చిత్రం రూపొందనుంది. ఇవి కాకుండా ఆమె పలువురు దర్శకులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని