Bandla Ganesh: మూడోసారి పాజిటివ్‌

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌ మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఇటీవలే దిల్లీ వెళ్లొచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ విషయాన్ని బండ్ల గణేష్‌ ఆదివారం రాత్రి ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘మూడు రోజులు నేను దిల్లీలో ఉన్నా.

Updated : 10 Jan 2022 06:49 IST

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌ మూడోసారి కరోనా బారిన పడ్డారు. ఇటీవలే దిల్లీ వెళ్లొచ్చిన ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ విషయాన్ని బండ్ల గణేష్‌ ఆదివారం రాత్రి ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘మూడు రోజులు నేను దిల్లీలో ఉన్నా. ఈ రోజు సాయంత్రం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలున్నాయి. మా కుటుంబ సభ్యులకి నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నా. దయచేసి  ప్రయాణాలు చేసే ముందు ఆలోచించండి. సురక్షితంగా ఉండండి’’ అంటూ ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌. ఆయన ఇదివరకు రెండుసార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని