Aswini dutt: నిర్మాతల నిర్ణయమే నా నిర్ణయం.. వారికి మద్దతిస్తా: అశ్వినీదత్‌

చిత్ర పరిశ్రమ గురించి నిర్మాతలంతా కలిసి తీసుకునే నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతుంటుందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ తెలిపారు. టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితిపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated : 28 Jul 2022 22:23 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమ గురించి నిర్మాతలంతా కలిసి తీసుకునే నిర్ణయానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ (Aswini Dutt) తెలిపారు. టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితిపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘యాభై ఏళ్లుగా చిత్ర‌సీమ‌లో నిర్మాత‌గా కొన‌సాగుతున్నా. నా తోటి నిర్మాత‌లంద‌రితోనూ చాలా స‌న్నిహితంగా, సోద‌రభావంతో మెలిగా. ఏ నిర్మాత‌పైనా నాకు అగౌర‌వం లేదు. గిల్డ్ అయినా, కౌన్సిల్ అయినా నిర్మాత‌లు, చిత్ర‌సీమ శ్రేయ‌స్సు కోస‌మే ఉద్భ‌వించాయి. ప‌రిశ్ర‌మ కోసం అంద‌రూ ఒక్క తాటిపై న‌డిచి, మంచి నిర్ణ‌యాలు తీసుకొంటే బాగుంటుంద‌ని నా అభిప్రాయం. నిర్మాత‌లంతా క‌లిసి చిత్ర‌సీమ గురించి ఏ మంచి నిర్ణ‌యం తీసుకొన్నా నా సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఉంటుంది’’ అని అశ్వినీదత్‌ తెలిపారు.

వైజయంతి మూవీస్‌ పతాకంపై తాను నిర్మించిన ‘సీతారామం’ సినిమా ప్రచారంలో భాగంగా అశ్వినీదత్‌ సంచలన వ్యాఖ్యలు తెలిసిన సంగతి తెలిసిందే. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవమని, గతంలో సమస్యలు వస్తే హీరోలు ఎవరూ రాలేదని, ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని