bunny vasu: పవన్ ఆవేదనను వివరించాం
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. పూజాహెగ్డే నాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. పూజాహెగ్డే నాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా అక్టోబరు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..
మధ్యతరగతి కుర్రాడిగా అఖిల్
అఖిల్ని చూడగానే సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిలాగా అనిపిస్తాడు. గత చిత్రాల్లో అలాంటి పాత్రలే పోషించాడు. ఇందులో మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తాడు. పెళ్లికి ముందు ఏం నేర్చుకోవాలనేది మా సినిమా చూపిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా పిల్లలకు ఏం నేర్పాలనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగని సందేశాలు ఇవ్వలేదు. ఏది చెప్పినా.. వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాం. స్క్రిప్ట్ విషయంలో భాస్కర్ ఎక్కువ సమయం తీసుకుంటాడు. దర్శకుడిగా తనకు సంతృప్తి దొరికే వరకు కథపై కసరత్తులు చేస్తాడు. షూటింగ్ మాత్రం చాలా వేగంగా పూర్తిచేస్తాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ 85 రోజుల్లోనే చిత్రీకరణ జరుపుకొంది. కరోనా దెబ్బతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెండేళ్ల సమయం తీసుకుంది. భాస్కర్ మిగతా సినిమాలకన్నా ఎక్కువ వినోదాన్ని అందిస్తుందీ సినిమా.
అక్కినేని కుటుంబం మాకు కలిసొస్తుంది
మా బ్యానర్ మొదట్లోనే నాగచైతన్య మంచి ఆరంభమిచ్చాడు. ‘100% లవ్’ లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. అక్కినేని ఫ్యామిలీ గీతాఆర్ట్స్కి బాగా కలిసొస్తుంది. ఆ సెంటిమెంట్ పునరావృతం అవుతుందని ఆశిస్తున్నాం. అన్నిటికీ మించి ఒక మంచి సినిమాను అందిస్తున్నామనే నమ్మకముంది.
పవన్ ఆవేదనను వివరించాం
ప్రస్తుతం మేమంతా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నాం. సినిమా విడుదల చేయడం ఆర్థికంగా రిస్క్తో కూడుకున్నది. కానీ ఇంకా ఆలస్యం చేస్తే మా సంస్థకి, అఖిల్కి నష్టమని నా అభిప్రాయం. ఓటీటీల నుంచి గట్టి పోటీ ఉంది. మా బాధలన్నీ ప్రభుత్వానికి వివరించాం. వాళ్లు కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ఒక మాటైతే ఇచ్చారు. కేసులు తగ్గగానే 100 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చూస్తామన్నారు. వీలైనంత త్వరగా అది అమల్లోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. పవన్ కల్యాణ్ తను అనుకున్నది చెబుతున్నారు. ఆయన ఆవేదనలోని విషయాన్ని మంత్రికి వివరించాం. ప్రభుత్వం చెబుతున్నది కూడా పవన్కి చెప్పాం. ఈ సమస్యను మరింత జఠిలం చేయొద్దని ఇరు వర్గాలను కోరాం. ఇద్దరూ పాజిటివ్గానే స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు!
అన్ని థియేటర్లలోనూ పేటీఎమ్, బుక్మైషో, జస్ట్ టికెట్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ప్రభుత్వం మొత్తంగా బుకింగ్ కౌంటర్ను ఎత్తేస్తుందని భావన ప్రజల్లోకి వెళ్లింది. కానీ అది వాస్తవం కాదు. మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుందని కాదు.. కానీ అర్ధరాత్రి పన్నెండు లోపు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి, ఎంత ఆదాయం వచ్చిందనే సమాచారం కోరుతుంది అంతే. సినిమా వ్యాపారాన్ని దెబ్బకొట్టాలని ఇలా చేయట్లేదు. కానీ కచ్చితమైన సమాచారం ఎలా ఇస్తారని అడుగుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఆన్లైన్ టికెట్ బుకింగ్పై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణలో థియేటర్లన్ని ఒక క్రమపద్ధతిలో నడుస్తాయి. పన్ను కట్టడం చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడున్న థియేటర్లు, మల్టీప్లెక్స్లు దాదాపు కార్పొరేట్ సంస్థలవే. పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు. అక్కడ థర్డ్ పార్టీల ఆధ్వర్యంలో నడిచే థియేటర్లు ఎక్కువ. క్యాంటిన్, ట్యాక్స్ సేవింగ్ మీద ఆదాయం ఉంటుంది. థియేటర్లలో వచ్చే ఆదాయానికి చెల్లించే పన్నుకు చాలా తేడా ఉంది. ప్రభుత్వానికి పన్నులు కట్టనప్పుడు, కనీసం సామాన్య ప్రజలకు అందబాటులో టికెట్ రేట్లు ఉండాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ఎగ్జిబిటర్లను జీఎస్టీలో చేరమని కోరాం.
‘పుష్ప’ విడుదలైతే కానీ చెప్పలేం
అల్లు అర్జున్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లేలా ‘పుష్ప’ ఉంటుంది. తదుపరి చిత్రం ఏదనేది ఇంకా తెలియలేదు. ‘ఐకాన్’, బోయపాటి సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందనే దానిపై స్పష్టత రాలేదు. మురుగదాస్తో అల్లుఅర్జున్ సినిమాపై చర్చలు నడుస్తున్నాయి. అనుకోకుండా ‘పుష్ప’ రెండు భాగాల్లో తెరకెక్కించే పరిస్థితి ఏర్పడింది. అది విడుదలైతే గానీ, మిగతా సినిమాలపై స్పష్టత రాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186