C Kalyan: పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరు నటించినా అది చరిత్ర సృష్టించేది: సి.కల్యాణ్
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ మీడియాతో ముచ్చటించారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా పలు విశేషాలు పంచుకున్నారు.
హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టులో సినిమా చిత్రీకరణలు నిలిపివేసి, సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనమేమీ లేదని ప్రముఖ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ అన్నారు. అది ఓ అట్టర్ ఫ్లాప్ షో అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
గోవా తరహాలో వేడుకలు..
గోవాలో ప్రతి సంవత్సరం జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు మించిన వేడుకలను ఇక్కడా నిర్వహించాలనే ఆలోచన ఉంది. దక్షిణాది సినిమాలకు పెద్ద పీట వేస్తూ వచ్చే ఏడాది నుంచి అవార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అవార్డుల విషయంలో పాదర్శకంగా వ్యవహరిస్తాం. ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా వచ్చే ప్రతి రూపాయినీ చిత్ర పరిశ్రమ కోసమే ఖర్చుచేస్తాం. ఈ ఇండస్ట్రీ వల్లే ‘కల్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్’ నిర్మించే అవకాశం దక్కింది. అది తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. సహాయ దర్శకుడిగా నా కెరీర్ చెన్నైలోనే ప్రారంభమైంది.
ఫిల్మ్ ఛాంబర్ శాశ్వతం..!
ఇటీవల షూటింగ్లు ఆపేసి, సమస్యలపై నిర్మాతలు చర్చించుకోవడం అనేది అట్టర్ ఫ్లాప్ షో. దాన్ని వల్ల ప్రయోజనం లేదనేది ఐదో రోజు సమావేశంలోనే నాకు అర్థమైంది. అగ్ర హీరోలతో సినిమాలు తీసే పెద్ద నిర్మాతలు డబ్బు ఎక్కడ వృథా అవుతుందోనన్న దాన్ని ఆ మీటింగ్ వల్ల తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికీ అమలుచేయలేకపోతున్నారు. ప్రొడ్యూసర్ గిల్డ్ తమ గురించి తామే మాట్లాడుకునే ఆర్గనైజేషన్. దాన్ని నేను పట్టించుకోను. అంతకు ముందు ఏదో పేరు ఉండగా అది గిల్డ్ అయింది, రేపు గిల్డ్ స్థానంలో మరోటి వస్తుంది. శాశ్వతంగా ఉండబోయేది ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడేందుకు దిల్ రాజు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకున్నాడు. కానీ, ప్రైవేట్ డిస్కషన్ వద్దనుకుని ఛాంబర్ తరఫున చర్చించుకున్నాం.
ఆ పరిస్థితి ఇప్పుడు లేదు
ఆంధ్రప్రదేశ్.. సినిమా పరిశ్రమకు రెండో ఊరు అయింది. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అక్కడికి నలుగురు కలిసి వెళ్లడమే పెద్ద పనిగా మారింది. పదేళ్ల తర్వాత ఏపీ వారు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండరని భావిస్తున్నా. ఒకప్పుడు కృష్ణా జిల్లా నుంచి పది మంది పరిశ్రమలో అడుగుపెడితే వారిలో ఒకరు విజయం సాధించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీలో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఉంది.
అది తప్పు
సంక్రాంతికి సినిమా విడుదల విషయంలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ చిత్ర బృందాలు ఫిర్యాదు చేయలేదు. అందుకే ఆ విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాట్లాడడం తప్పు. దీని గురించి వారికీ చెప్పాను. ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయితో మేం జీవితంలో నిలబడ్డాం. అందుకే పరిశ్రమకు సహకరించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
నా బాధ అదే..
నేను నిర్మించిన ‘గాడ్సే’ మంచి చిత్రం. అయితే, ఓటీటీలో చూసినంతగా ప్రేక్షకులు దాన్ని థియేటర్లలో చూడలేదు. ఆ కథను మోయగలిగే నటుడుకావాలని నేను దర్శకుడికి ముందే చెప్పా. కానీ, అప్పటికే హీరో ఫిక్స్ అయిపోయాడు. ఆ సబ్జెక్ట్ని బాగా డీల్ చేయగలిగేది తెలుగులో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ మాత్రమే. ఈ ఇద్దరిలో ఎవరు నటించినా ‘గాడ్సే’ ఓ చరిత్ర సృష్టించేది. పిల్లల్ని బాగా చదివించి, వారికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లితండ్రులందరికీ ఇది రీచ్ అవుతుందని భావించాం. కానీ, కుదరలేదు. అదొక్కటే బాధ. రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాం. నటుడు సత్యదేవ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది.
తదుపరి ప్రాజెక్టులు..
‘ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు’ సినిమా పూర్తయింది. ఆ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. ఆయనకు మంచి విజయం అందిస్తుందని అనుకుంటున్నా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అది. ఓ అగ్ర హీరోతో ‘రామానుజాచార్య’ అనే సినిమాను ఇంగ్లిష్లో నిర్మించనున్నాం. అంతర్జాతీయ కంపెనీతో కలిసి ఆ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేయబోతున్నాం. త్వరలోనే ప్రారంభిస్తాం. ముందుగా ఈ సినిమాని మూడు భాగాలుగా తీయాలనుకున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒకే సినిమాగా చేస్తున్నాం. ‘బాలకృష్ణ చేస్తారా?’ అని ప్రశ్నించగా ఆయన్నే అనుకుంటున్నామని కల్యాణ్ తెలిపారు. వీటితోపాటు తక్కువ బడ్జెట్లో కొన్ని చిత్రాలు నిర్మిస్తున్నానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్తేజ్తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్