Nagavamsi: ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌.. జగన్‌గారిని అడగండి..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధానపాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ విడుదల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో పలు చిత్రబృందాలు ఇప్పటికే రిలీజ్‌ ....

Published : 03 Feb 2022 14:21 IST

నిర్మాత నాగవంశీ కామెంట్స్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధానపాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ విడుదల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో పలు చిత్రబృందాలు ఇప్పటికే రిలీజ్‌ డేట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ‘భీమ్లానాయక్‌’ని ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్‌ 1న విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకున్న ‘డీజే టిల్లు’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమ బ్యానర్‌ నుంచి పలు స్టార్‌ హీరోల సినిమాలతోపాటు మూడు చిన్న సినిమాలు వస్తున్నాయని అన్నారు. అనంతరం ఓ విలేకరి ‘భీమ్లానాయక్‌’ విడుదలెప్పుడని కోరగా.. ‘‘చెప్పాను కదండి. అయితే ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్‌ 1న విడుదల చేయాలనుకుంటున్నాం. జగన్‌గారిని అడగండి నైట్‌ కర్ఫ్యూ ఎప్పుడు ఎత్తేస్తే అప్పుడు ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌ చేస్తాం’’ అని అన్నారు. నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని