Suriya: మరోసారి లాయరుగా సూర్య.. సూపర్‌హిట్‌ సినిమా సీక్వెల్‌పై నిర్మాత క్లారిటీ

సూర్య నటించిన ఓ సూపర్‌హిట్‌ సినిమాకు సీక్వెల్‌ రాబోతుంది. అదే చిత్రమంటే?

Published : 30 Nov 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ తమిళ నటుడు సూర్య (Suriya) కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో ‘జై భీమ్‌’ (JaiBhim) ఒకటి. గతేడాది నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్వీక్వెల్‌పై కోలీవుడ్‌లో కొంతకాలం చర్చ సాగింది. నిర్మాత స్పందనతో ఆ విషయంపై స్పష్టత వచ్చింది. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకకు ఆ చిత్ర దర్శకుడు త.శె. జ్ఞానవేల్‌, సహ నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌ హాజరయ్యారు. అక్కడ ‘జై భీమ్‌’ సీక్వెల్‌ ప్రస్తావనరాగా.. కొనసాగింపు చిత్రం తప్పకుండా వస్తుందని తెలిపారు. జస్టిస్‌ చంద్రు ఎన్నో కేసులను హ్యాండిల్‌ చేశారని గుర్తుచేశారు. దీన్ని బట్టి ‘జై భీమ్‌’ ఫ్రాంచైజీలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రముఖ న్యాయవాది చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చేయని తప్పునకు జైలుపాలై, ప్రాణాలు కోల్పోయిన తన భర్త పరిస్థితి మరొకరికి రాకూడదని ఓ మహిళ చేసిన న్యాయపోరాటమిది. చంద్రు పాత్రలో సూర్య నటించారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ (విదేశీ) విభాగంలో 94వ ఆస్కార్‌ అవార్డుల షార్ట్‌ లిస్ట్‌ జాబితాలో నిలిచిందీ చిత్రం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని