puneet rajkumar: పునీత్‌ నటించిన ఆఖరి చిత్రం.. విడుదల ఎప్పుడంటే?

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ అకాల మరణం అందరినీ కలచి వేసింది. ఏడాదికి రెండు సినిమాలతో పలకరించే పునీత్.. చనిపోయే సమయానికి జేమ్స్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన బాడీ బిల్డర్‌గా కనిపించారు...

Published : 26 Jan 2022 01:46 IST

బెంగళూరు: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ అకాల మరణం అందరినీ కలచి వేసింది. ఏడాదికి రెండు సినిమాలతో పలకరించే పునీత్.. చనిపోయే సమయానికి ‘జేమ్స్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన బాడీ బిల్డర్‌గా కనిపించారు. ఆఖరి చిత్రం ‘జేమ్స్‌’ స్పెషల్‌ పోస్టర్‌ బుధవారం ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు చేతన్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మార్చి 17న పునీత్‌ జయంతి సందర్భంగా అదే రోజున థియేటర్లలో విడుదల చేయబోతున్నారని ప్రకటించారు. ఈ కారణంగా మార్చి 17- 23 మధ్యలో ఇతర సినిమాలేవీ విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్ణయించారు.

టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ ఇందులో విలన్‌గా నటించగా.. పునీత్‌ కారణంగా ఆయన అన్నయ్య శివ రాజ్‌కుమార్‌ పునీత్‌ వాయిస్‌కు డబ్బింగ్‌ చెప్పారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించారు, అను ప్రభాకర్‌ ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. పునీత్‌ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, శివరాజ్‌ కుమార్‌ అతిథి పాత్రలు చేశారు. కాగా.. పునీత్‌ చనిపోవడానికి ముందే ఈ సినిమా షూటింగ్‌ పూర్తైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని