PURI Musings: భూమ్మీద ఉన్న అద్భుత నగరమదే
ఈ భూమ్మీద ఉన్న సుందరమైన నగరం ఇటలీలోని వెనిస్ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. వెనిస్ అందాలు, అక్కడి జీవన స్థితిగతుల గురించి తాజాగా ఆయన అందరితో పంచుకున్నారు....
2030 నాటికి దెయ్యాల ప్రాంతంగా మారనుందంటున్నారు
హైదరాబాద్: ఈ భూమ్మీద ఉన్న సుందరమైన నగరం ఇటలీలోని వెనిస్ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. వెనిస్ అందాలు, అక్కడి జీవన స్థితిగతుల గురించి తాజాగా ఆయన వివరించారు. అత్యంత అందమైన ప్రాంతంగా చెప్పుకునే ఈ వెనిస్ నగరం 2030 నాటికి ఘోస్ట్ సిటీగా మారనుందని అందరూ అనుకుంటున్నారని ఆయన తెలిపారు. ఒకవేళ అవకాశం వస్తే వెనిస్ అందాలు చూడడానికి వెళ్లాలని సూచించారు. పూరీ మ్యూజింగ్స్ వేదికగా ‘వెనిస్’ గురించి ఆయన ఏమన్నారంటే..
‘ప్రపంచంలోనే అందమైన నగరాల్లో వెనిస్ ఒకటి. దీన్ని వెనిజియా అని కూడా పిలుస్తారు. ఇటలీలోని నార్త్ ఈస్ట్లో కట్టిన సిటీ ఇది. ఒకప్పుడు అక్కడ 118 చిన్న ద్వీపాలు ఉండేవి. వాటి మీదనే ఈ నగరాన్ని నిర్మించారు. ప్రతి ద్వీపానికి మధ్య చెరువులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ ద్వీపాలన్నింటినీ కలపడం కోసం చెరువులపై నాలుగు వందల చిన్న చిన్న వంతెలు నిర్మించారు. వెనిస్లో కార్లు, బైక్లు ఉండవు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలంటే పడవలోనే ప్రయాణించాలి. ఆ పడవల్ని గండోలాస్ అంటారు. ఒక గండోలా 11 మీటర్ల పొడవులో ఉండి.. చూడముచ్చటగా ఉంటుంది’
‘ప్రముఖ పర్యాటకవేత్త, రచయిత మార్కోపోలో ఈ ప్రాంతానికి చెందినవాడే. ఇక్కడ అణువణువు ఎంతో అందంగా ఉంటుంది. వీధి దీపాలు, రోడ్డు పక్కన కూర్చొనే బల్లలు చివరికి చెత్తకుండీలు కూడా ఎంతో అందంగా డిజైన్ చేసి ఉంటాయి. ఇక్కడ జరిగే అతిపెద్ద పండుగ.. కార్నివాల్. ఆ కార్నివాల్ రోజున అందరూ అందమైన ఫేస్ మాస్క్ వేసుకుని తిరుగుతారు. 16వ శతాబ్దంలో అయితే కార్నివాల్ సమయంలో ఎవరైనా ఫేస్ మాస్క్ లేకుండా కనిపిస్తే వాళ్లకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించేవాళ్లు. లేదా ప్రజలు వాళ్లని బాగా కొట్టి స్తంభానికి కట్టేసేవాళ్లు. ఫేస్మాస్క్ విషయంలో వాళ్లు అంత కచ్చితంగా ఉండేవాళ్లు’
‘‘ఎస్’ ఆకారంలో ఉన్న ఓ పెద్ద చెరువు సిటీని రెండు భాగాలుగా చేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కాసినో ఇక్కడే ప్రారంభమైంది. అలాగే ప్రపంచంలోనే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన మొదటి మహిళ ఈ ప్రాంతానికి చెందినవారే. 1646లో ఆమె గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. వెనిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్. ఎక్కడ చూసినా మ్యూజిషియన్స్ కనిపిస్తూనే ఉంటారు. ఈదొక అద్భుతమైన నగరం. రోజూ ఈ నగరానికి రంగులద్దుతూ ఎంతోమంది పెయింటర్స్ మనకి కనిపిస్తూనే ఉంటారు. నేను అక్కడ ఉన్నప్పుడు ‘టూరిస్ట్’ సినిమా కోసం ఏంజెలినా జోలీ వెనిస్ వచ్చి వెళ్లిందని తెలిసిందే. వెంటనే నేను ఆమె ఉన్న హోటల్కి వెళ్లి షూటింగ్ అని అబద్ధం చెప్పి ఏంజెలినా జోలీ ఉన్న రూమ్లోకి వెళ్లి.. ఆమె సేద తీరిన మంచంపై కూర్చొని వచ్చాను’
‘వెనిస్ అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారడం వల్ల ప్రతి ఇల్లు కూడా హోటల్గానో రెస్టారెంట్గానో మారిపోయింది. దాంతో స్థానికులకు ఇల్లు అద్దెకు దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో పర్యాటకాన్ని ఆపేయమని గతేడాది చాలామంది స్థానికులు గొడవలు కూడా చేశారు. ఎందుకంటే, ఒకప్పుడు 1.20 లక్షల జనాభా ఉన్న ఆ నగరం ఇప్పుడు 60 వేలకు దిగజారింది. అయితే, వెనిస్ రోజురోజుకీ నీటిలోకి మునిగిపోతుందని.. 2030 కల్లా అది ఒక దెయ్యాల నగరంగా మారుతుందని అందరూ చెప్పుకుంటున్నారు. అది నిజమో కాదో తెలీదు. కానీ వీలైతే మాత్రం వెనిస్ ఒక్కసారి వెళ్లి చూసి రండి. భూమ్మీద ఉన్న అందమైన నగరమదే’ అని పూరీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.