Puri Musings: భవిష్యత్తు దారుణంగా ఉండనుంది
వైరస్ల నుంచి దూరంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటే తప్పకుండా ‘ఆఫ్ ది గ్రిడ్ లివిండ్’ను అవలంభించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. భవిష్యత్తు ఎంతో దారుణంగా ఉండనుందని..
వైరస్లకు దూరంగా ఉండాలంటే ‘ఆఫ్ ది గ్రిడ్’
హైదరాబాద్: వైరస్ల నుంచి దూరంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటే తప్పకుండా ‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ను అవలంభించాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సూచించారు. భవిష్యత్తు ఎంతో దారుణంగా ఉండనుందని.. కాబట్టి ప్రతిఒక్కరూ ‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ను అలవాటు చేసుకోవాలంటూ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ‘పూరీ మ్యూజింగ్స్’ వేదికగా పలు సందేశాత్మక అంశాలతో అందర్నీ ఆకట్టుకుంటోన్న ఆయన తాజాగా ‘ఆఫ్ ది గ్రిడ్’ గురించి ఎన్నో విశేషాలు బయటపెట్టారు. ఇంతకీ ‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ అంటే ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
‘‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’.. నాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో ప్రకృతిలో ఎలాంటి ప్రజా వినియోగాలు లేకుండా బతకడం. ‘లివింగ్ ఆఫ్ ది గ్రిడ్’ అంటే మంచినీళ్లు, కరెంటు, గ్యాస్, ఇంటర్నెట్.. ఈ విధమైన రకాలైన మౌలిక వసతులు లేకుండా జీవించడం. స్వయం సమృద్ధ జీవనశైలి. గోయింగ్ ఆఫ్ ది గ్రిడ్ అనేది కొంతమంది మాత్రమే చేయగలరు. అలా చేయాలంటే సరైన ప్రదేశాన్ని చూసుకుని ముందు ఇల్లు నిర్మించుకోవాలి. సోలార్ లాంటి పవర్ సోర్సులు పెట్టుకోవాలి. కుదిరితే వర్షం నీటిని సైతం ఉపయోగించుకునేలా చూసుకోవాలి.’
‘‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ను ఫాలో అయ్యేవాళ్లు కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ల ఆహారాన్ని వాళ్లే పండించుకుంటారు. పశువులు, కోళ్లను పెంచుకుంటారు. పర్యావరణసహిత ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేస్తారు. దాన్నే పంటలకు ఎరువుగా కూడా వాడతారు. అన్నిరకాల చెట్లు పెంచుకుంటారు. ధాన్యం, మొక్కజొన్న కూడా పండిస్తారు. వాళ్లకి కరెన్సీతో పనిలేదు. అప్పులు లేని జీవితం. జీవితాంతం ప్రతినెలా ఎవ్వరికీ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. అప్పులవాళ్లు వచ్చి వాళ్ల ఇంటి తలుపులు కొట్టరు. ఎలాంటి నోటీసులు వాళ్ల ఇంటికి రావు’
‘ప్రపంచంలో 35మిలియన్ల మంది ఇలా ‘ఆఫ్ ది గ్రిడ్’ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పర్యావరణం పట్ల వీళ్లు ఎంతో బాధ్యతగా ఉంటారని చెప్పొచ్చు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. మన పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల సంవత్సరాలు బతికారు. వీళ్లు సైతం ఆనాటి పూర్వీకుల జీవనశైలిని ఫాలో అవుతుంటారు. అప్పట్లో అందరిదీ ‘ఆఫ్ గ్రిడ్ లివింగే’ కాబట్టే మన భూమి ఎంతో పచ్చగా ఉండేది. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100 డైనోసార్లు అడవిలో పుట్టి అదే అడవిలో చనిపోతే ఈ ప్రకృతికి కూడా గుర్తు ఉండదు. కానీ నలుగురు మానవులు బతికి చనిపోయిన తర్వాత చూస్తే అడవి సగం నరికేసి ఉంటుంది. అందుకే ప్రకృతి మనల్ని గుర్తు పెట్టుకుంటుంది’
‘మనకి ప్రకృతిలో బతకడం రాదు. ఆఫ్ గ్రీడ్గా జీవించేవాళ్లు ఈ ప్రకృతికి ఎంతో అవసరం. మనందరం జీవితంలో ఇలాంటి ఆఫ్ గ్రిడ్ ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వైరస్ల నుంచి దూరంగా సంతోషంగా బతకాలంటే ఇలాంటిది మనకి కావాలి. పట్టణాలకు దూరంగా ఇలాంటి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉండనుంది. మీ పిల్లలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అది ఇదే. దగ్గరలో ఆస్పత్రి లేకపోతే ఎలా అని భయపడొద్దు. అక్కడ రోజూ పనిచేసుకుంటూ బతికితే మీకు ఎలాంటి జబ్బులు ఉండవు. పోతే వృద్ధాప్యంతోనే పోతారు. నీటిలో చేపల్లాగా, గాలిలో పక్షుల్లాగా, అడవిలో జంతువుల్లాగా.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఫ్రీగా హాయిగా బతికే మార్గం ఆఫ్ ది గ్రిడ్. వెనక్కెళ్లి బతుకుదాం. ముందుకెళ్లి పీకేది ఏమీ లేదు’’ అని పూరీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు