వీటి వల్లే వ్యాధులు పెరిగిపోతున్నాయ్: పూరీ
ఆహారాన్ని సహజంగా కాకుండా నిల్వ ఉంచి తీసుకోవడం వల్ల వ్యాధులు అధికమౌతున్నాయని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ప్యాకెట్లు, టిన్నుల్లో ఉండే ఆహారానికి దూరంగా ఉండమని సూచించారు. పూరీ మ్యూజింగ్స్లో భాగంగా ఆయన ‘ప్రాసెస్డ్ ఫుడ్’ గురించి మాట్లాడారు.....
బ్యాక్టీరియా తినే ఫుడ్ మనం తిందాం
హైదరాబాద్: ఆహారాన్ని సహజంగా కాకుండా నిల్వ ఉంచి తీసుకోవడం వల్ల వ్యాధులు అధికమౌతున్నాయని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ప్యాకెట్లు, టిన్నుల్లో ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు. పూరీ మ్యూజింగ్స్లో భాగంగా ఆయన ‘ప్రాసెస్డ్ ఫుడ్’ గురించి మాట్లాడారు.
‘ఒకప్పుడు మనం సముద్రంలో బతికేవాళ్లం. ఉభయచరంగా మారి.. భూమి మీద పాకుతూ.. క్రమంగా మనుషులమయ్యాం. అలా సముద్రానికి, ఉప్పుకు దూరమయ్యాం. రోజూ వేటాడటం కష్టం కాబట్టి వ్యవసాయం మొదలెట్టాం. పాలు, మాంసం కోసం జంతువుల్ని పెంచుతున్నాం’.
‘ఆ తర్వాత ఆహారం నిల్వ కోసం ప్రాసెస్డ్ ఫుడ్ మొదలెట్టాం. చేపలు, మాంసం, కూరగాయలు ఎండబెట్టాం. వీటికి ఉప్పు, నూనె కలిపితే బ్యాక్టీరియా రాదని కనిపెట్టి పచ్చళ్లు చేస్తున్నాం. ఆ తర్వాత వేపుడు, చెకోడీలు, పకోడీలు, అప్పడాలు.. ఇలా ఎన్నో. స్వీట్లు, జామ్లు కూడా తయారు చేశాం. విత్తనాల్ని పొడిచేసి, దాచుకోవడం మొదలెట్టాం. ప్రాసెస్డ్ అంటే.. సహజంగా ఉన్న ఆహారాన్ని మనం ఇంకో రూపంలోకి తీసుకొచ్చి అసహజంగా తయారు చేయడం’.
‘ఇలాంటి ఆహారాన్ని మన శరీరం తేలిగ్గా భరించలేదు. ఎందుకంటే వీటిని తినడానికి తగ్గట్టుగా మన శరీరాన్ని తయారు చేయలేదు. మనం ఒక్కసారిగా ఆహారాన్ని మార్చేశాం. కానీ మన శరీర నిర్మాణం, జీర్ణవ్యవస్థ మారలేదు. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు మన శరీరం దాన్ని ఆహారం అనుకోదు. వేరే ఏదో పదార్థం వచ్చింది, అయినా ప్రయత్నిద్దాంలే.. అనుకుంటుంది. రెండు లక్షల సంవత్సరాలుగా మన శరీరానికి చెరకు గడ తినడమే తెలుసు. ఆరడుగల చెరకు గడ తింటే రెండు స్పూన్ల చక్కెర వస్తుందని మాత్రమే తెలుసు. మనం షుగర్ ఫ్యాక్టరీ పెట్టి, రెండు చెంచాల చక్కెరను ఒకేసారి లోపల వేస్తున్నాం. శరీరం కంగారు పడుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ నాలుగు చెంచాలు వేస్తే శరీరానికి భయం. ఎందుకంటే మనం విత్తనాల నుంచి ఆయిల్ తీస్తున్నామని, ఫ్యాక్టరీలు పెట్టామని దానికి తెలియదు. ఇది సహజమైన ఆహారం కాదనుకుంటుంది. ఆలూ చిప్స్ తిన్నా అంతే.. దానికి అర్థం కాకపోయినా ఏదో ప్రయత్నిస్తుంటుంది పాపం’
‘ఇలా శరీరాన్ని తికమకపెట్టే ఆహారాన్ని మనం ఎక్కువగా కనిపెడుతున్నాం. వీటి వల్లా డయాబెటిక్స్, మెటబాలిక్ సిండ్రోమ్, హైపర్ టెన్షన్ వంటివి పెరిగిపోయాయి. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సింపుల్ రూల్ ఏంటంటే.. త్వరగా పాడైపోయే ఆహారం మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇది పాడైపోద్ది అనుకుంటే అది మంచి ఆహారం. ఈ ఫుడ్ బయటున్నా పాడు కాదంటే అది చెడ్డది. ఆహారం పాడైపోయిందంటే.. బ్యాక్టీరియా తినడం మొదలు పెట్టిందని అర్థం. జెంతికలు, చెకోడీలు, పచ్చళ్ల వైపు బ్యాక్టీరియా కన్నెత్తి కూడా చూడదు. బ్యాక్టీరియానే వద్దు అనుకున్న ఆహారం మనకు ఎందుకు? బ్యాక్టీరియా ఏం తింటే మనం కూడా అదే తిందాం..’ అని పూరీ తన స్టైల్లో వివరించారు.
ఇవీ చదవండి..
జర్నలిస్టు ఇంటికెళ్లి.. హామీ ఇచ్చిన చిరు
ప్రభాస్ చిత్రంపై కామెంట్.. చిక్కుల్లో నటుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా