Puri Musings: ‘ఇడియట్’లో రక్షిత పనికి నాకు కోపం వచ్చింది.. గట్టిగా అరిచేశా!
తెలుగు సినీ దర్శకుడు పూరిజగన్నాథ్ (Puri Jagannadh) ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘రియాక్షన్స్’ అనే టాపిక్పై మాట్లాడారు.
ఇంటర్నెట్డెస్క్: ‘ఇడియట్’ మూవీ షూటింగ్ సందర్భంగా కథానాయిక రక్షితకు గట్టి వార్నింగ్ ఇచ్చానని, కానీ, ఆ తర్వాత ఆమె చెప్పిన సమాధానం విని నవ్వు ఆగలేదని దర్శకుడు పూరిజగన్నాథ్ (Puri Jagannadh) అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings) పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ‘రియాక్షన్స్’పై మాట్లాడారు.
‘‘జీవితంలో చాలా జరుగుతాయి.. జరుగుతుంటాయి. వాటి మీద మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. మన చేతిలో ఉండేది ఒక్కటే, రియాక్షన్స్ ఇవ్వడమే. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నామనేది చాలా ముఖ్యం. ఎంత కష్టమొచ్చినా, ఏ సమస్య వచ్చినా మన రియాక్షన్ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి. అరిచి గోల చేసేయడం, తల గోడకేసి కొట్టుకోవడం వాటి వల్ల అస్సలు ఉపయోగం లేదు. నీ ఎమోషన్స్ వల్ల, తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటావు. సమస్య ఎప్పుడూ సమస్య కాదు. నీ ప్రతిస్పందన వల్ల వచ్చే సమస్యే అసలు సమస్య. మనం మనుషులకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? సంఘటనలకు ఎలా రియాక్ట్ అవుతున్నాం? లేదా ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి ఏం సమాధానం ఇస్తున్నామనేది చాలా ముఖ్యం. బ్యాలెన్డ్స్గా ఆలోచించడం, ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏ మాట్లాడినా, మన భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకొని మాట్లాడాలి’’
‘‘మీరు విపరీతమైన కోపంలో ఉంటే అస్సలు సమాధానం చెప్పొద్దు. చాలా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోండి. చాలా సార్లు ఏమీ చేయకపోవడం, భావాలను వ్యక్తపరచకపోవడం ఇంకా మంచిది. అవతల మనిషి కోపంలో ఉన్నప్పుడు నవ్వుతూ సమాధానం ఇవ్వండి. వాడికి ఏం చేయాలో తెలియదు. ‘ఇడియట్’ (Idiot) షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సీన్లో రక్షిత (Rakshita) సరిగా చేయడం లేదు. అది ఏడ్చే సీన్. కానీ, పగలబడి నవ్వుతోంది. నాకు కోపం వచ్చింది. సెట్లో అందరూ వింటుండగా, ‘రక్షిత నువ్వు ఫోకస్ చేయడం లేదు. తర్వాతి సినిమాలో నీకు క్యారెక్టర్ రాయను’ అని చాలా గట్టిగా చెప్పా. తను వెంటనే ‘రాయి.. రాయకపోతే చంపేస్తాను. నీ తర్వాతి పది సినిమాలు నేనే చేస్తా. ఇప్పుడు నీకు ఏం కావాలో సరిగా చెప్పి చావు’ అని అన్నది. అంతే, ఆ అమ్మాయి స్పందనకు సెట్లో అందరూ క్లాప్స్కొట్టారు. ఆ మాటలకు నాకు కూడా నవ్వు ఆగలేదు. నేను ఊహించని సమాధానం అది. ఆ అమ్మాయి మీద కోపం మొత్తం పోయింది’’
‘‘నేను అన్న మాటలకు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ సెట్లో నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. లేదా అలిగి రెండో రోజూ షూటింగ్కు రాకపోవచ్చు. కానీ, తను అలా చేయలేదు. మన రియాక్షన్స్ వల్ల లైఫ్లో చాలా విసుగు, చికాకులను తగ్గించుకోవచ్చు. ఇవికాకుండా సోషల్మీడియాలో ఎవరెవో పోస్టులు పెడతారు. ప్రతి దానికీ మనం స్పందించాల్సిన అవసరం లేదు. అలాగే న్యూస్... ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్గా రియాక్ట్ అయి, వాదించడం అవసరమా? మనం పనికి వచ్చే వాటికే స్పందిద్దాం. నవ్వుతూ చెప్పే సమాధానం, లేకపోతే, ఏ సమాధానం చెప్పకుండా మీరు నవ్వే చిన్న చిరునవ్వు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ లేఖ విడుదల చేశారు. -
నాలుగు క్యారవాన్లు ఇస్తే కానీ సెట్లోకి రారు : సెలబ్రిటీల తీరుపై దర్శకురాలు కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ తారలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకురాలు పరాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్గా మారాయి. -
వాళ్ల పార్టీలకు వెళ్లకపోవడం వల్లే మంచి అవకాశాలు రాలేదు: పరిణీతి చోప్రా
తన పీఆర్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు నటి పరిణీతి చోప్రా చెప్పారు. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. -
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు