puri jagannadh: పూరి అంతర్జాతీయ చిత్రం

అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘లైగర్‌’ సినిమాని పూర్తి చేశారు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రంలో నటించిన కథానాయకుడు విజయ్‌ దేవరకొండతోనే మరో సినిమాని తెరకెక్కించేందుకు పూరి సిద్ధమయ్యారు. ‘జనగణమన’ పేరుతో రూపొందనున్న

Updated : 22 Feb 2022 09:52 IST

గ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘లైగర్‌’ సినిమాని పూర్తి చేశారు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రంలో నటించిన కథానాయకుడు విజయ్‌ దేవరకొండతోనే మరో సినిమాని తెరకెక్కించేందుకు పూరి సిద్ధమయ్యారు. ‘జనగణమన’ పేరుతో రూపొందనున్న ఆ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయి చిత్రమే. పూరి కలల చిత్రమైన ‘జనగణమన’ ఆయన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కబోతోంది. వీటి తర్వాత పూరి జగన్నాథ్‌ చేయబోయే మరో సినిమా కూడా ఖరారైంది. అదొక అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కనుందని పూరి కనెక్ట్స్‌ వర్గాలు తెలిపాయి. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్‌ స్వయంగా నిర్మించనున్నారు. అందులో ఎవరు నటిస్తారనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. భాషల మధ్య ఇప్పుడు హద్దులు చెరిగిపోయాయి. ఏ భాషలో సినిమా చేసినా అది అంతర్జాతీయ స్థాయిలో చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దర్శకనిర్మాతలు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆరంభంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని