Puri Musings: మానవజాతిని కాపాడాలంటే.. ఇదొక్కటి చేయండి చాలు: పూరి జగన్నాథ్
మరో 50ఏళ్ల తర్వాత ప్రపంచం దారుణంగా ఉంటుందని దర్శకుడు పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డారు. ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో ఆయన మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు.
హైదరాబాద్: జనాభా నియంత్రణ విషయంలో ఇప్పటికైనా అందరూ మేల్కొనాలని, లేకపోతే భవిష్యత్ అంధకారం అవుతుందని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings)పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘స్టాప్ హ్యూమన్స్’ అనే అంశంపై మాట్లాడారు.
‘‘మనిషి పుట్టి, ఇప్పటికి రెండు లక్షల సంవత్సరాలు అయింది. మానవజాతి పెరుగుతూ వచ్చి, 8 బిలియన్లు దాటింది. రోజూ 4లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. బర్త్రేట్తో డెత్రేట్ సమానంగా లేదు. చావులు తక్కువ. పుట్టుకలు ఎక్కువైపోయాయి. మనుషుల వల్ల సగం ప్రకృతి నాశనం అయిపోయింది. అడవులన్నీ మంటగలిసిపోయాయి. మనం తిండి కోసం ఏటా 80 బిలియన్ జంతువులను చంపుతున్నాం (ఇందులో కోళ్లను మినహాయిస్తే..). 1970 తర్వాత 60శాతం జంతువులు అంతరించిపోయాయి. మనం వేటినీ బతకనీయడం లేదు. అన్నీ అంతరించిపోతున్నాయి. దీనికి తోడు అందరం పిల్లల్ని పుట్టించడంలో బిజీగా ఉన్నాం. చాలా తప్పు. మానవజాతి ఆగాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఆగకపోతే, మనం ఆపలేం. 1971లో లెస్యునైట్ అనే సామాజిక ఉద్యమకారుడు వాలంటరీ హ్యూమన్ ఎక్సిటిన్షన్ ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. ఈ భూగ్రహాన్ని కాపాడాలంటే, మానవ జాతి అంతరించిపోవాలి. అదొక్కటే సమాధానం. ఇదొక ఉద్యమం’’
‘‘ఆ ఉద్యమంలో పాల్గొనాలంటే మనం ఆత్మహత్య చేసుకోనవసరం లేదు. కనీసం పెళ్లిళ్లు చేసుకోవడం మానేయాలి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కనడం మానేయాలి. నా పిల్లలు, నా వంశం అనే ఆలోచనల నుంచి బయట పడాలి. ఇలాంటి ఆలోచన రావాలంటే, ఈ ప్లానెట్ను ప్రేమించేంత పెద్ద మనసు ఉండాలి. మీరే వాలంటరీగా మీ వంశాన్ని ఆపాలి. మీ జాతిని ఆపాలి. మీది బ్లూ బ్లడ్ అయినా సరే, మీ పిల్లల్ని ఆపాలి. పిల్లల్ని కనడం ఆపకపోతే, కొన్నాళ్లకు ఈ భూగ్రహం మనుషులతో నిండిపోతుంది. వేరే జంతువులు, పక్షులు, చెట్లు ఉండవు. ఈ మధ్య చాలా మంది ఆడవాళ్లు.. తమ అండాలను భద్రపరచుకోవడం మొదలు పెట్టారు. అసలు మీ అండాలు ఎందుకు దాచుకోవాలి. భవిష్యత్లో పిల్లల కోసమా? భవిష్యత్ చాలా దారుణంగా ఉండబోతోన్న నేపథ్యంలో అందులో మీ పిల్లలు ఎందుకు? మీ సరదా కోసం పిల్లల్ని కని, పెంచి కొన్నాళ్లకు చచ్చిపోతావు. కానీ, అతి దారుణమైన వాతావరణంలో మీ డీఎన్ఏకు పుట్టిన మీ వారసులను వదిలి వెళ్తున్నారని గుర్తు పెట్టుకోండి’’
‘‘50ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. గ్లోబల్ వార్మింగ్ పెరిగి, వాతావరణం ఇంకా వేడెక్కుతుంది. గ్లేసియర్స్ మాయమైపోతాయి. సముద్రాలు యాసిడ్లా మారతాయి. 70శాతం హిమాలయాలు కరిగిపోతాయి. ప్రపంచ జనాభా మరో 10 బిలియన్లు పెరుగుతుంది. సహజ వనరులు ఉండవు. తినడానికి తిండి ఉండదు. సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఇవి కాకుండా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, డెంగ్యూ, ఎయిడ్స్, ఎబోలా, హెర్పస్, ఇన్ఫ్లూయాంజా, చికెన్పాక్స్, కరోనా వైరస్ దాని రకాలు ఉన్నాయి. ఈ లెక్కన అప్పటికి ఎన్ని వైరస్లు వస్తాయో లెక్క పెట్టండి. దయ చేసి, మీ అండాలను భద్రపరచకండి. ఉన్న పిల్లలు చాలు. మనందరం స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో చేరి, పునరుత్పత్తిని ఆపగలిగితే, 200 ఏళ్ల వరకూ మానవ మనుగడ సాగుతుంది. అప్పుడు ఈ ప్లానెట్ పచ్చగా ఉంటుంది. వాలంటరీ హ్యూమన్ ఎక్సిటిన్షన్ అనేది అద్భుతమైన ఆలోచన’’ అని పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్.. ఫొటోలు చూశారా!
నటుడు తిరువీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. -
కార్మికుల కోసం అడగ్గానే అంగీకరించారు: చిరంజీవి
ప్రముఖ హీరో చిరంజీవి హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. ఆ సంగతులివీ.. -
నేను ఎప్పటికీ అలాంటి పాత్రలు పోషించను: ఆ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి!
బాలీవుడు నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉండటంపై స్పందించారు. -
యూట్యూబ్లో రవితేజ చిత్రం రికార్డు.. నిర్మాణ సంస్థ పోస్ట్
స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger nageswara rao). రవితేజ (ravi teja) కథానాయకుడిగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. -
రష్మిక యాక్టింగ్ సూపర్.. ఆ రోల్ కోసం తొలుత నన్నే అడిగారు: మాజీ ప్రపంచ సుందరి
తన సరికొత్త చిత్రం ‘బడే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి మానుషి చిల్లర్ (Manushi Chhillar). -
గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్ పోస్ట్
నటుడు నాని (Nani) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’ (Jersey). 2019లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్