Raajahyogam: ఓటీటీలో ‘రాజయోగం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

క్రైమ్‌ కామెడీ చిత్రం ‘రాజయోగం’ త్వరలోనే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 02 Feb 2023 15:09 IST

హైదరాబాద్‌: సాయి రోనక్‌, అంకిత సాహా, బిస్మీ నాస్‌, అజయ్‌ఘోష్‌ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ చిత్రం ‘రాజయోగం’ (Raajahyogam). డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఇది అందుబాటులోకి రానుంది.

కథేంటంటే: రిషి (సాయి రోనక్‌) మధ్య తరగతి యువకుడు. మెకానిక్‌గా పని చేస్తుంటాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్నది అతడి కల. అందుకోసం సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఓసారి తను రిపేర్‌ చేసిన కారును దాని యజమానికి ఇచ్చేందుకు స్టార్‌ హోటల్‌కి వెళ్తాడు. అక్కడ శ్రీ (అంకిత సాహా)ను చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే, ఇంతకీ శ్రీ ఎవరు? ఆమె నిజ స్వరూపం ఏంటి? దాన్ని బయట పెట్టడానికి రిషి ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? మధ్యలోకి వచ్చిన ఐశ్వర్య(బిస్మీనాస్‌) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని