Raashii Khanna: ఇంకో ఇరవయ్యేళ్లైనా ఇలాగే నా ప్రయాణం
‘‘దక్షిణాది - ఉత్తరాది... కంటెంట్ - కమర్షియల్... సినిమా... ఓటీటీ... - వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేయడమే నా ముందున్న లక్ష్యం’’ అంటోంది కథానాయిక రాశీఖన్నా. పలు భాషల్లో నటించినా తెలుగుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది.
‘‘దక్షిణాది - ఉత్తరాది... కంటెంట్ - కమర్షియల్... సినిమా... ఓటీటీ... - వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేయడమే నా ముందున్న లక్ష్యం’’ అంటోంది కథానాయిక రాశీఖన్నా. పలు భాషల్లో నటించినా తెలుగుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఒకవైపు సినిమాలు చేస్తూనే... కొంతకాలంగా వెబ్ సిరీస్లపై కూడా దృష్టిపెట్టింది. ఇటీవల షాహిద్ కపూర్తో కలిసి ‘ఫర్జి’లో నటించింది. ఈ సందర్భంగా రాశీఖన్నా గురువారం విలేకర్లతో ముచ్చటించింది.
ఒకవైపు సినిమాలు... మరోవైపు వెబ్ సిరీస్లు సమాంతరంగా చేస్తున్నట్టున్నారు కదా?
ఓటీటీ వేదికలు నటులకి గొప్ప అవకాశాల్ని తెచ్చి పెడుతున్నాయి. వెబ్ షోలతో లోతైన పాత్రలు చేసే అవకాశం లభిస్తోంది. ఓటీటీ షోలపై ప్రేక్షకులు చూపెడుతున్న ఆసక్తి కూడా మరింత ప్రోత్సాహకరంగా ఉంది. అందుకే ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్లు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేయాలనుకుంటున్నా. నాకు ఓటీటీ నుంచి వచ్చిన తొలి అవకాశం ‘ఫర్జి’. ‘ఫ్యామిలీ మేన్’ షోస్ తర్వాత రాజ్, డీకే దర్శకద్వయం చేసిన షో ఇది. ప్రేక్షకుల నుంచి షోకి లభిస్తున్న స్పందన ఎంతో తృప్తినిస్తోంది.
మీ సినిమా ప్రయాణం హిందీ నుంచే మొదలైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ వెబ్ సిరీస్ల కోసం హిందీలో పనిచేశారు. ఆ అనుభవాలు పంచుకుంటారా?
నేనిప్పుడు గుర్తింపు సమస్యతో సతమతమవుతున్నా (నవ్వుతూ). హైదరాబాద్లో ఉంటే నన్ను నేను తెలుగమ్మాయిలానే భావిస్తా. తమిళనాడుకి వెళితే తమిళమ్మాయినే అనుకుంటా. హిందీకి వెళితే అది నా సొంత భాష కాబట్టి నేనక్కడి అమ్మాయిని అయిపోతాను. అయితే ‘ఫర్జి’ చేస్తున్నప్పుడు నిన్నిప్పుడంతా దక్షిణాది అమ్మాయిలానే చూస్తారని చెప్పారు దర్శకులు రాజ్ - డీకే.
తెలుగు సినిమా ప్రయాణం గురించి ఏం చెబుతారు? ఈమధ్య మీరు చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు కదా?
తెలుగు సినిమాల విషయంలో ఆశించిన ఫలితాలు రాలేదన్నది నిజమే. అయితే తెలుగులో అనువాదాలుగా వచ్చిన ‘సర్దార్’, ‘తిరు’ మాత్రం రూ.100కోట్లకిపైగా వసూలు చేశాయి. నటుల ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. తెలుగు ప్రేక్షకుల నాకు వాళ్ల హృదయాల్లో స్థానం ఇచ్చారు. అది దృష్టిలో ఉంచుకునే మంచి పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నా.
నా ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టు ఉంది. ఇంకో ఇరవయ్యేళ్లైనా తెరపై నటిస్తూనే ఉంటా. ఈ ప్రయాణాన్ని అంతగా ఆస్వాదిస్తున్నా. తెలుగులో మహేష్బాబుతో కలిసి నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. నాని, శర్వానంద్తోనూ ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఎవరెవరితో పనిచేయలేదో వాళ్లందరితోనూ కలిసి సినిమా చేయాలని ఉంది.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ