Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ దర్శకుడి ఆసక్తికర ట్వీట్‌... దాని అర్థం అదేనా?

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో థియేటర్లలో విడుదలకావాల్సిన పలు భారీ బడ్జెట్‌ చిత్రాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పాన్‌ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు బాలీవుడ్‌ ‘జెర్సీ’ విడుదలకు వెనకడుగు వేశాయి.

Updated : 04 Jan 2022 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో థియేటర్లలో విడుదలకావాల్సిన పలు భారీ బడ్జెట్‌ చిత్రాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పాన్‌ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు బాలీవుడ్‌ ‘జెర్సీ’ విడుదలకు వెనకడుగు వేశాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జనవరి14న విడుదల కావాల్సిన ‘రాధేశ్యామ్‌’పై పడింది. అనుకున్న రోజుకే ఈ చిత్రం వస్తుందా లేదా వాయిదా పడుతుందా అనే చర్చ నడుస్తుండగా.. మంగళవారం రాధేశ్యామ్‌ దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘‘సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా, మనసులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా ఆశలు ఉన్నతంగా ఉన్నాయి’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన ఓ నెటిజన్‌.. వాయిదా వేస్తున్నట్లు పరోక్షంగా చెబుతున్నావా అన్నా అని అడగగా.. అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా చెబుతామని రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇలాంటి సమయాల్లోనే మనసును మరింత దృఢం చేసుకోవాలి. రాధేశ్యామ్‌ టీమ్‌ అందరికీ నా బెస్ట్‌ విషెస్‌’’ అని  ‘బాహుబలి’ చిత్రాల నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్‌ చేశారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు