Radheshyam: ‘రాధేశ్యామ్‌’ రిజల్ట్‌పై ప్రభాస్ ఏమన్నారంటే..!

ఫీల్‌గుడ్‌, క్లాసిక్‌ ప్రేమకథా చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించారు....

Published : 19 Mar 2022 13:22 IST

చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఫీల్‌గుడ్‌, క్లాసిక్‌ ప్రేమకథా చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కాగా, ‘రాధేశ్యామ్‌’కు వస్తోన్న డివైడ్‌ టాక్‌పై రాధాకృష్ణ స్పందించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.

‘‘మా సినిమాపై ప్రశంసలు, విమర్శలు రెండూ ఒకేలా వస్తున్నాయి. సినిమా విడుదలైన సమయంలో కొంతమంది నుంచి నెగెటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి కనెక్ట్‌ అవుతున్నారు. సినిమా చాలా బాగుందని, ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నామని.. చాలా మంది నాకు మెస్సేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా నా సతీమణి నుంచి వచ్చిన ప్రశంస మర్చిపోలేను. సినిమా చాలా బాగుందని, చాలా సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకున్నానని తను చెప్పింది. సినిమా విడుదలయ్యాక ప్రభాస్‌ని కలవలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం హాలీడే కోసం విదేశాలకు వెళ్లారు. మేమిద్దరం ఫోన్స్‌లోనూ మాట్లాడుకోలేదు.. కానీ సమయం దొరికినప్పుడు మెస్సేజ్‌లు చేసుకుంటున్నాం. ‘‘మొదటి మూడు రోజులు నా ఇమేజ్‌ సినిమాని డామినేట్‌ చేసేస్తుంది’’ అని ప్రభాస్‌ నాకు చాలా సార్లు చెప్పాడు’’ అని రాధాకృష్ణ కుమార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని