Raghavendra Rao: చెబుతున్నంతసేపూ నవ్వుతున్నాం..
‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకానికి అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రావు పెట్టిన ఉపశీర్షిక అది. ఆయన జీవితంలో పండుకి ఉన్న ప్రాధాన్యం అదీ!
కె.రాఘవేంద్రరావు
కొంచెం తీపి... కొంచెం కారం... కొంచెం పండ్లు...
- ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకానికి అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రావు పెట్టిన ఉపశీర్షిక అది. ఆయన జీవితంలో పండుకి ఉన్న ప్రాధాన్యం అదీ! న్యూటన్ ఆపిల్ పడినప్పుడు గురుత్వాకర్షణ కనిపెడితే, నేను మాత్రం ఆపిల్ ఎక్కడ పడాలో కనిపెట్టానని చెబుతారాయన. అందుకేనేమో ఇటీవల ‘వాంటెడ్ పండుగాడ్’ అంటూ ఓ సినిమానీ సమర్పిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇది ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా దర్శకేంద్రుడు ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘సామాజికంగా... రాజకీయంగా చాలా గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈఎమ్ఐలు, పెరిగిన ధరలు, ఫీజులు, కరోనా తర్వాత పరిణామాలు... వీటిన్నిటితో ఎవరిని కదిపినా సరే ఒక రకమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మనందరికీ కావల్సింది స్వచ్ఛమైన నవ్వు. మనసుకి చికాకుగా అనిపించిందంటే మన మిత్రుల్లో సరదాగా మాట్లాడే వాళ్లుంటే కాసేపు వాళ్లదగ్గరికి వెళ్లి గడుపుతాం. అలా ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి హాస్యభరితం చిత్రం చేస్తే బాగుంటుందనిపించింది. అప్పుడే జనార్ధన మహర్షి ఓ కథ చెప్పారు. చెబుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాం. జంధ్యాల, ఈవీవీ ఉన్నప్పుడు వాళ్ల సినిమాలకి వెళ్లి కడుపుబ్బా నవ్వుకుని వచ్చేవాళ్లం. మన జీవితాల్లో అరుదైనవి కాబట్టి హాస్యానికీ, గ్లామర్కీ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. జనార్ధన మహర్షి కథ చెప్పగానే ఇది నా శైలి పాటలతో, వందశాతం వినోదంతో సినిమా తీయాలని నడుం బిగించాం. అదే... ‘వాంటెడ్ పండుగాడ్’’.
* ‘‘నిధి వేట తరహాలో సాగే కథ ఇది. పట్టుకుంటే కోటి అనే ఉపశీర్షికలోనే ఈ కథ ఉంది. ఇందులో ఒకొక్కరికీ ఒక్కో అవసరం ఉంటుంది. ఆ అవసరాలు చాలా సరదాగా, నవ్వుకునేలా ఉంటాయి. వాళ్లందరూ కోటి కోసం ఎలా ప్రయత్నించారనేది ఈ సినిమా కథ. నటుల్లో చాలామంది ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పట్టుకుంటే పది కోట్లు’ అని, ఆ తర్వాత ఇరవై కోట్లు అని వరుసగా సినిమాలు చేద్దామన్నారు. వాళ్లందరినీ అంతగా ప్రభావితం చేసిందీ కథ. ఎంతో బాధ్యతగా తీసుకుని కొత్తతరాన్ని పరిచయం చేశా. కథానాయకులు, కథానాయికలు, సాంకేతిక నిపుణులు... చాలామందే నా సినిమాలతో పరిచయమయ్యారు. మొన్న ‘పెళ్లిసందడి’తో నాయకానాయికలుగా పరిచయమైన రోషన్, శ్రీలీల వరకు అందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుల్ని పరిచయం చేస్తున్నా. ‘పెళ్లిసందడి’ సినిమాకి మాటలు రాస్తూ మాతో ప్రయాణం చేసిన శ్రీధర్ సీపానలో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. తనైతే బాగుంటుందని దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పా’’.
* ‘‘ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ2’ ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వైవిధ్యంగా సాగే సినిమాలు. మా సినిమా చాలా రోజుల తర్వాత వస్తున్న సంగీతం, గ్లామర్ ప్రధానంగా సాగే
పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం’’.
* ‘‘ఆత్మకథలా నా గురించి కాకుండా... పరిశ్రమకి, రాబోయే తరానికి ఉపయోగపడాలనే ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకాన్ని రాశా. నేను ‘సౌందర్యలహరి’తో మాట్లాడటానికీ కారణం అదే. ఇంత జీవితాన్నిచ్చిన సినీ రంగానికి మనమేదైనా చేయాలనే మాట్లాడా. ప్రతి ఎపిసోడ్ ఓ పాఠంలా నాతో కలిసి పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలతో ఆ కార్యక్రమం సాగుతుంది. సహాయ దర్శకులు, దర్శకులు వాళ్ల జీవితాల్లో చేయాల్సినవి, చేయకూడనివంటూ కొన్ని ఉంటాయి. అలాంటి విషయాల్ని నా అనుభవాలతో ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశా. అక్కడక్కడా నా వ్యక్తిగత జీవిత విశేషాలు ఉంటాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి ఈ పుస్తకాన్ని చదివి ఫిల్మ్ ఇండస్ట్రీ బైబిల్గా అభివర్ణించారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి