Raj Tarun: రాజ్‌తరుణ్‌, శివానీ ‘అహ నా పెళ్లంట’.. మొదలైంది!

 రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ‘అహ నా పెళ్లంట’. ఈ సిరీస్‌ పూజా కార్యక్రమాలతో రాజమహేంద్రవరంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది.

Published : 04 Apr 2022 23:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ‘అహ నా పెళ్లంట’. ఈ సిరీస్‌ పూజా కార్యక్రమాలతో రాజమహేంద్రవరంలో ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, చందన నాగేశ్వరరావు, కందుల దుర్గేష్‌, ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి  శ్రీధర్‌ తదితరులు అతిథులుగా హాజరై, సిరీస్‌ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాళి కట్టే సమయానికి పెళ్లి కూతురు తన ప్రియుడితో వెళ్లిపోతే ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరిపై ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ‘ఏబీసీడీ’ చిత్ర ఫేం సంజీవ్‌ రెడ్డి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జీ 5, తమడ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఆమని, హర్షవర్ధన్‌, పోసాని కృష్ణమురళీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. రాజమహేంద్రవరం పరిసరాల్లో 15 రోజులు చిత్రీకరించనున్నాం. ఈ సిరీస్‌లో ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఈ కథను 8 ఎపిసోడ్స్‌లో చూపించనున్నాం’’ అని నిర్మాతలు రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా తెలిపారు. ఈ కామెడీ- లవ్‌ సిరీస్‌కి సంగీతం: జాదుహ్‌ శాండి, కథ, స్క్రీన్ ప్లే: దావూద్, మాటలు: కల్యాణ్‌ రాఘవ, పాటలు: రఘురామ్‌, కూర్పు: మధు జి. రెడ్డి, ఛాయాగ్రహణం: నగేశ్‌ బన్నెల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని