Raja Raja Chora: సినిమాలో ప్రతి పాత్ర మిమ్మల్ని నవ్విస్తుంది: హసిత్ గోలి
కేవలం కామెడీ మాత్రమే సినిమాను నడింపిచలేదని.. మంచి కథ కూడా ఉండాలని అంటున్నాడు యువ డైరెక్టర్ హసిత్ గోలి. ఆయన దర్శకత్వం వహించిన ‘రాజరాజ చోర’ ఆగస్టు 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే..
ఇంటర్నెట్ డెస్క్: కేవలం కామెడీ మాత్రమే సినిమాను నడిపించలేదని.. మంచి కథ కూడా ఉండాలని అంటున్నాడు యువ డైరెక్టర్ హసిత్ గోలి. ఆయన దర్శకత్వం వహించిన ‘రాజరాజ చోర’ ఆగస్టు 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే..
* మా నాన్నగారి వల్ల చిన్నప్పటి నుంచే సాహిత్యం మీద నాకు ఇష్టం ఉండేది. హౌసింగ్ కార్పొరేషన్లో సివిల్ ఇంజినీర్గా పనిచేసేవారు. నాకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. మనం కూడా సినిమాలు చేయగలమని అనిపించి షార్ట్ఫిల్మ్లు చేశాం. వాటికి మంచి ప్రశంసలు వచ్చాయి. అలా నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చాం.
* లక్షల్లో జీతం వదులుకొని సినిమాల్లోకి వచ్చినందుకు మా అమ్మ కొంత ఆందోళనకు గురైంది. మా నాన్న మాత్రం నాకు సపోర్టుగానే ఉన్నారు. అమ్మ మాత్రం సినిమాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అని కంగారు పడేది. నాకు కూడా మొదట్లో అలాగే ఉండేది. అయితే.. ‘మెంటల్ మదిలో’ తర్వాత నా అభిప్రాయం మారింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
* ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నప్పటికీ ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎన్నో తెలివితేటలు ఉండాలి. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలకు డైరెక్షన్ టీమ్లో పని చేశాను. ఆ అనుభవంతో పాటు ఇప్పుడు సినిమా చేయగలను అనే నమ్మకం ఏర్పడ్డ తర్వాతే నేను డైరెక్టర్గా మారాను.
* నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. నేను ఎక్కువగా అలాంటి సినిమాలే చేయడానికి అది కూడా కారణం కావచ్చు.
* సినిమాల పేర్లన్నీ అచ్చ తెలుగులోనే ఉండాలని మొదట్లోనే మేం అనుకున్నాం. షార్ట్ఫిల్మ్స్ కూడా అచ్చం తెలుగులోనే ఉండేవి. ‘మెంటల్ మదిలో’ సినిమాకు కూడా ‘చెల్లియోచెల్లకో’ అనే టైటిల్ పెడదాం అనుకున్నాం. కానీ.. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. షార్ట్ఫిల్మ్స్ అన్నింటికీ తెలుగు టైటిల్స్ పెట్టి సినిమాకు మాత్రం ఇంగ్లిష్ టైటిల్ పెట్టాల్సి వచ్చిందని వివేక్ కాస్త బాధపడ్డాడు. అందుకే ఆ తర్వాత వచ్చిన చిత్రానికి ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఇప్పుడు ‘రాజరాజ చోర’తో వస్తున్నాం. మేమంత మొదటి నుంచి ఒకే టీమ్తో పనిచేస్తున్నాం. అందరి అభిరుచి ఒకేలా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతోంది.
* నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి నాలో తెలుగు భాష స్థిరపడిపోయింది. అందుకే తెలుగు భాష మీద నాకు అభిమానం ఎక్కువే. మా టీమ్లో కూడా భాష గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. తమిళులు మాత్రమే వాళ్ల భాష గురించి బాగా పోరాడతారు.. మనం ఎందుకు చేయకూడదు. అసలు మనం మన భాష కోసం ఏం చేయగలం అనే చర్చలు జరుగుతూ ఉంటాయి.
* ఈ సినిమా కామెడీ డ్రామా. నేచురల్గా వచ్చిన ఆలోచన. అయితే.. కామెడీ సినిమాతో డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాలని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం కామెడీతోనే సినిమా నడుస్తుందని నేను నమ్మను. మంచి కథ లేకపోతే ముందుకెళ్లదు. డ్రామా సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను.
* సినిమా టైటిల్ ‘రాజరాజ చోర’ టైటిల్ ఊరికే పెట్టలేదు. దానికి అర్థం ఉంది. అప్పట్లో రాజు వస్తుంటే రాజ రాజ అంటూ వినిపించేది. ఏ రాజుకైనా తన పేరు ముందు ప్రిఫిక్స్ ఇస్తే కొంచెం గంభీరంగా ఉంటుంది. చోర అనేది దొంగకు పర్యాయపదం. దొంగ అనే బదులు చోర అంటే వినడానికి బాగుంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాం.
* ట్రైలర్లో హీరో కిరీటం పెట్టుకోవడం కనిపిస్తుంది. అయితే.. ఆ కిరీటం వెనుకాల కూడా ఓ కారణం ఉంటుంది. సినిమా మొత్తం దానికి సంబంధించిన మరో కథ నడుస్తూ ఉంటుంది.
* సినిమాలో ప్రతి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఏదో ఒక్క పాత్రకే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూడాలని అనుకోలేదు. సినిమాలో ప్రతి ఒక్క కేరెక్టర్ కూడా ప్రేక్షకులను అలరించాలన్న జాగ్రత్తలు తీసుకున్నాం. హీరో పాత్ర కొంచెం హైలైట్ అవుతారనడంతో అనుమానం లేదు. గంగవ్వ గురించి చెప్పాలంటే హీరోకు ఉన్న ఏకైక ఫ్రెండ్ ఆమె. కథలు చెప్పే ముసలవ్వగా ఆమె కనిపిస్తుంది.
* నిర్మాతలకు కథ చెప్పి ఒప్పించడం కొంచెం కష్టమైన పనే. అయితే.. మొదట విష్ణుగారికి కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. ఇలాంటి మంచి కథను నిర్మించేందుకు ఎవరో ఒకరు నమ్ముతారనే మా ఇద్దరి నమ్మకం. ఎం.ఎల్.కుమార్ చౌదరి, కీర్తి గారికి కథ చెప్పాం. అలా నిర్మాతలు సులభంగానే నిర్మాతలు దొరికారు.
* మొదటి సినిమానే కరోనా వల్ల ఆలస్యం కావడం నాకు పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే వచ్చీరావడంతోనే అన్ని మనం అనుకున్నట్లు జరగాలని ఏం లేదు. సినిమా ఆలస్యం కావడం వల్ల కథకు ఇంకా మెరుగులు దిద్దాను. కరోనా ఎప్పుడు తగ్గుతుందో అనే విషయం ఎవరికీ తెలియదు. అందుకే కంగారు పడటం వల్ల వచ్చేది ఏం లేదు.
* మొదటి లాక్డౌన్ సమయానికి సినిమా షూటింగ్ మొదటి భాగం మాత్రమే పూర్తయింది. సెకండ్ వేవ్ తర్వాత రెండో భాగం షూటింగ్తో పాటు నిర్మాణానంతర పనులు పూర్తి చేశాం. మా సినిమా ఓటీటీలో వస్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులకు థియేటర్కు వచ్చి మనసారా నవ్వుకోవడం చాలా అవసరం అని మేమంతా భావించాం. అందుకే థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం.
* ప్రత్యేకంగా ఏదో ఒక సందేశం ఇవ్వడం ఈ సినిమాలో కనిపించదు. మనం అందరం నిజ జీవితంలో ఎలా ఉంటామో అలాగే సినిమాలో పాత్రలు ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడే ఎవరికి వారు అంతర్లీనంగా సందేశాలు స్వీకరిస్తారు.
* కమర్షియల్ అంటే నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ డబ్బులు తెచ్చే సినిమా. ఎక్కువగా చదువుకున్నవాళ్లు ఈ మధ్య కమర్షియల్ సినిమాలు తీస్తున్నారంటే దానికి కారణం వాళ్ల దగ్గర కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలను సులభంగా కలుస్తారు. బాగా మాట్లాడటం. లాజికల్గా ఒప్పించడం వల్ల కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. ఇప్పుడు పరిస్థితుల్లో చదువుకున్న డైరెక్టర్లు ఇండస్ట్రీకి అదనపు బలం. చదువుకున్నవాళ్లు అనే ట్యాగ్ ఉంటే సరిపోదు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
* సినిమా థియేటర్ నుంచి బయటకు రాగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారు. ఆ నమ్మకం మా టీమ్లో అందరికీ ఉంది. ఎందుకంటే మాలోనే చాలా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్లకు కూడా సంగీతం బాగుందన్నారు. ఈ సినిమా విడుదలయ్యే వరకూ ఇంకో ప్రాజెక్టు మొదలుపెట్టాలని అనుకోవట్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్