Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ.. కానీ

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌పై రాజమౌళి స్పందించారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఆ పనిలోనే ఉన్నారని తెలిపారు.

Published : 13 Nov 2022 16:34 IST

షికాగో: తన దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు (RRR) సీక్వెల్‌ ఉంటుందని రాజమౌళి (Rajamouli) తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ గురించి ఇప్పటికే చర్చలు సాగాయని, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను రాసే పనిలో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సినీ ప్రియులు, రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రకటన ఓకే కానీ ఇది ఎప్పుడొస్తుందో? అంటూ కొందరు సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తున్నారు. ‘2030లోనే’ అంటూ ఎమోజీలు జతచేస్తున్నారు.

రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu)తో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. విభిన్న యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఆ సినిమా స్క్రిప్టు దశలోనే ఉంది. ఇది పట్టాలెక్కి, చిత్రీకరణ పూర్తి చేసుకొనేందుకు చాలా సమయం పడుతుంది. మహేశ్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక మహేశ్‌.. రాజమౌళి చిత్రంలో నటించే అవకాశం ఉంది. రెండేళ్లకు రాజమౌళి- మహేశ్‌బాబు కాంబోలో సినిమా పూర్తవుతుందనుకున్నా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ 2’ తీయాలంటే అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ డేట్స్‌ ఖాళీగా ఉండాలి. వీరిద్దరు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులకు కమిట్‌ అయి ఉన్నారు. ఈ హీరోలు అప్పటికే తమ సినిమాలు పూర్తి చేసి ఈ క్రేజీ సీక్వెల్‌ కోసం కలవాలంటే ఎంత టైమ్‌ పడుతుందో చెప్పలేని పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని