Rajamouli: విశ్వమా.. కాస్త గ్యాప్ ఇవ్వమ్మా!
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani)కి పద్మశ్రీ పురస్కారం (Padma Shri Awards) లభించడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) కూడా తనదైన శైలిలో ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ కీరవాణితో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘‘నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాలని మీ అభిమానులందరిలాగే నేనూ భావిస్తున్నాను. కానీ ఈ విశ్వం ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఊహించని రీతిలో అందిస్తుందని మీరు చెప్పే మాటలను గుర్తుపెట్టుకుంటాను. ఒకవేళ నాకు ఈ విశ్వంతో మాట్లాడే అవకాశం వస్తే..‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా, ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వు’ అని చెబుతాను. నా పెద్దన్న కీరవాణికి పద్మశ్రీ పురస్కారం రావడం ఆనందంగా, గర్వంగా ఉంద’’ని ఆ ట్వీట్లో పేర్కొన్నారు రాజమౌళి.
పౌర పురస్కారం...గొప్ప గౌరవం: కీరవాణి
తనకు పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి. ‘‘భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులు, నన్ను ప్రోత్సహించిన కవితాపు సీతన్న గారు మొదలు..కుప్పాలా బులిస్వామినాయుడు గారి వరకూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’అని ట్వీట్ చేశారు కీరవాణి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..