అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌

ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

Updated : 25 Dec 2020 13:33 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ‘‘రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. బీపీని అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నాం. ఈ సమస్య తప్ప ఇతర ఇబ్బందులు ఏమీ లేవు. రక్తపోటు అదుపులోకి రాగానే రజనీకాంత్‌ను డిశ్ఛార్జి చేస్తాం. ఈ నెల 22న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది’’ అని అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రజనీకాంత్‌ తన తదుపరి చిత్రం 'అన్నాత్తే' చిత్రీకరణ  కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చిత్రీకరణ నిలిపేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 22న ఆయనకు కొవిడ్‌-19 పరీక్ష చేయగా నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన గత కొన్నిరోజులుగా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని