Shivani Rajasekhar: ‘మిస్‌ ఇండియా’ పోటీకి రాజశేఖర్‌ కుమార్తె

నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె, నటి శివాని ‘ఫెమినా మిస్‌ ఇండియా’ (femina miss india 2022) పోటీలో పాల్గొనబోతుంది. ఈ మేరకు నిర్వహించే ఆడిషన్స్‌కు ఆమె సోమవారం హాజరైంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ అభిమానుల ఆశీస్సులు కోరింది.

Published : 19 Apr 2022 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు రాజశేఖర్‌ పెద్ద కుమార్తె, నటి శివాని ‘ఫెమినా మిస్‌ ఇండియా’ (femina miss india 2022) పోటీలో పాల్గొనబోతోంది. సోమవారం ఆడిషన్స్‌కు హాజరయ్యానని, తన వంతుగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చానంటూ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. అభిమానుల ఆశీస్సులు కోరింది. ‘‘కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఈ అవకాశం ఇచ్చిన ఫెమినా సంస్థకు ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న మహిళలకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని శివాని పేర్కొంది. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘అద్భుతం’ చిత్రంతో నటిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాని ఆ తర్వాత ‘WWW’ సినిమాతో అలరించింది. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. రాజశేఖర్‌ హీరోగా తాను నిర్మించిన ‘శేఖర్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. గతంలోనూ పలు విజయవంతమైన సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని