పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌ ‘క్లైమాక్స్‌’

పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌గా భవానీ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లైమాక్స్‌’. రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరెడ్డి, పృథ్వీరాజ్‌, శివ శంకర్‌ మాస్టర్‌

Published : 19 Sep 2020 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌గా భవానీ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లైమాక్స్‌’. రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరెడ్డి, పృథ్వీరాజ్‌, శివ శంకర్‌ మాస్టర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను నటుడు రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘మోషన్ పోస్టర్ అందర్ని ఆకట్టుకుంటుంది.. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’అని అన్నారు. ‘మోషన్ పోస్టర్‌ని రాజేంద్రప్రసాద్‌గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని దర్శకుడు భవానీ శంకర్‌ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో భవానీ శంకర్‌ ‘డ్రీమ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఫిలిం ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు దక్కాయి. రాజేష్‌ నిద్వాన స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని రాజేశ్వర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డిలు నిర్మిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని