Cinema News: ఆ ఇద్దరి మధ్య...

కోటి తనయుడు రాజీవ్‌ సాలూర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘11: 11’. కిట్టు నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. గాజుల వీరేష్‌ (బళ్లారి) నిర్మాత. సదన్‌, రోహిత్‌, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మోషన్‌

Updated : 27 Jan 2022 07:06 IST

కోటి తనయుడు రాజీవ్‌ సాలూర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘11: 11’. కిట్టు నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. గాజుల వీరేష్‌ (బళ్లారి) నిర్మాత. సదన్‌, రోహిత్‌, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని ప్రముఖ కథానాయకుడు రానా  దగ్గుబాటి బుధవారం విడుదల చేశారు. మూడు పాత్రలతో కూడిన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ప్రేయసీ ప్రియుడు మధ్యకి మూడో వ్యక్తి రావడం, అతన్ని హతమార్చడం మోషన్‌ పోస్టర్‌లో కనిపిస్తుంది. ఇంతకీ ఆ ఇద్దరి మధ్యకి వచ్చిన మూడో వ్యక్తి ఎవరనేది తెరపైనే చూడాలి. థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిదనీ, విడుదలకి ముస్తాబవుతోందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఈశ్వర్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని