Rajini-Mohanbabu: ప్రాణమిత్రులు కలిశారిలా!

అగ్ర నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో చాలామందికి తెలిసిందే. రజనీ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అణ్ణాత్తే’.

Published : 21 May 2021 13:06 IST

హైదరాబాద్‌: అగ్ర నటులు రజనీకాంత్‌, మోహన్‌బాబు ఎంత‌టి ప్రాణ స్నేహితులో చాలామందికి తెలిసిందే. రజనీ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అణ్ణాత్తే’. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో పూర్తి చేసుకుంది. రజనీకాంత్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న రజనీ హైద‌రాబాద్‌లోని తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు.

అక్క‌డే రెండు రోజుల‌ పాటు సంతోషంగా గ‌డిపారు. ఆ తర్వాత  ప్ర‌త్యేక విమానంలో చెన్నై వెళ్లారు. ఆ స‌మ‌యంలో ర‌జనీకాంత్‌, మోహ‌న్‌బాబు, విష్ణు మంచు క‌లిసి ఫొటోలు దిగారు. ‘ఒరిజిన‌ల్‌ గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసిన వేళ’ అంటూ మంచు విష్ణు ఆ ఫొటోలను తన ట్విటర్‌లో పంచుకున్నారు. వైట్‌ అండ్‌ వైట్‌లో అగ్ర నటులిద్దరూ మెరిసిపోతూ కనిపించారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని