Allu Arjun: బన్నీ శపథం నిజమైన వేళ.. ఇంతకీ ఆయన ఏం శపథం చేశారు?
‘పుష్ప’ సినిమా విడుదలైన తర్వాత.. ప్రతి దర్శకుడు సుకుమార్పై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆయన వద్ద నుంచి సినిమాని తెరకెక్కించడంలో కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటారు. అలా కనుక జరగకపోతే.. మైత్రి ఆఫీస్లో చొక్కా విప్పి తిరుగుతా’’....
హైదరాబాద్: ‘‘పుష్ప’ సినిమా విడుదలైన తర్వాత.. ప్రతి దర్శకుడు సుకుమార్పై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆయన వద్ద నుంచి సినిమాని తెరకెక్కించడంలో కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటారు. అలా కనుక జరగకపోతే.. మైత్రి ఆఫీస్లో చొక్కా విప్పి తిరుగుతా’’.. ‘పుష్ప’ విడుదల ముందు రోజు జరిగిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడిదే మాటలను సినీ ప్రియులు గుర్తు చేసుకుంటున్నారు. బన్నీ చెప్పింది నిజమే అంటున్నారు. ఇంతకీ అసలేమైందంటే..
క్రిస్మస్ కానుకగా గతేడాది డిసెంబర్లో ‘పుష్ప’ విడుదలైన నాటి నుంచి భారతదేశ చిత్రపరిశ్రమలోని చాలామంది ప్రముఖులు ఈ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బన్నీ, సుకుమార్ని పొగడ్తలతో ముచ్చెత్తకుండా ఉండలేకపోతున్నారు. ఈక్రమంలోనే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ‘మున్నాబాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ వంటి చిత్రాలు తెరకెక్కించిన రాజ్కుమార్ హిరాణీ.. సుకుమార్ వర్క్ని ప్రశంసించారు. సుకుమార్ నంబర్ తెలుసుకుని ప్రత్యేకంగా మెస్సేజ్ పంపించారు. ‘‘గుడ్ మార్నింగ్ సుకుమార్ జీ.. నేను రాజు హిరాణీ. ‘పుష్ప’ సినిమా చూసిన నాటి నుంచి మీకు మెస్సేజ్ చేయాలనుకుంటున్నా. కాకపోతే మీ నంబర్ నా వద్ద లేదు. నిన్ననే నేను మహవీర్ జైన్ని కలిశా. ఆసమయంలో మేమిద్దరం మీ గురించే మాట్లాడుకున్నాం. అలా, నాకు మీ నంబర్ దొరికింది. ‘పుష్ప’ని మీరు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మీ సినిమా గురించి నేను ఎంతోమందితో చెప్పాను. నేను చెప్పే విధానం చూసి నాకేదో అయ్యిందన్నట్లు వాళ్లు ఆశ్చర్యపోయారు. కథ.. ఒక సీన్ని మించి మరొక సీన్ని మీరు తెరకెక్కించిన విధానం అదిరింది. బన్నీ నటన, సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. గ్రేట్ ఎంటర్టైనర్. ఎంజాయ్ చేశా. మీరు ఇలాగే అత్యద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాలి. మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుకుంటున్నా. ఎప్పుడైనా మీరు ముంబయికి వస్తే తప్పకుండా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి’’ అని హిరాణీ మెస్సేజ్ చేశారు. హిరాణీ మెస్సేజ్పై స్పందించిన సుక్కు.. ‘‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్గా చెప్పుకునే మీ నుంచి సందేశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మీరు పంపించిన మెస్సేజ్ని నా స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు రిప్లై ఆలస్యంగా ఇస్తున్నాను. ఫిల్మ్ మేకింగ్, కథ రాయడంలో మీరు నాకెంతో స్ఫూర్తి’’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ మెస్సేజ్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. అది చూసిన నెటిజన్లు ఆరోజు బన్నీ చేసిన శపథాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం