Rakesh Sashii: కథ, దర్శకుడు... కుదిరితేనే..!
‘‘నేను తీసే సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలనుకుంటా. ‘ఊర్వశివో రాక్షసివో’ అలాంటి చిత్రమే’’ అన్నారు యువ దర్శకుడు రాకేశ్ శశి.
‘‘నేను తీసే సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలనుకుంటా. ‘ఊర్వశివో రాక్షసివో’ అలాంటి చిత్రమే’’ అన్నారు యువ దర్శకుడు రాకేశ్ శశి (Rakesh Sashii). ‘జతకలిసే’ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఈయన.... ‘విజేత’తో మెప్పించారు. తన మూడో చిత్రంగా ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) తెరకెక్కించారు. అల్లు శిరీష్ (Allu Sirish) కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాకేశ్ శశి గురువారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు.
* ‘‘కథానాయకుడు అల్లు శిరీష్తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. మేం కలిసి సినిమా చేయాలని రెండు మూడుసార్లు అనుకున్నాం. కానీ కుదరలేదు. అనుకోకుండా నిర్మాత అల్లు అరవింద్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన నేను తీసిన ‘విజేత’ని చూసి అప్పట్లో మెచ్చుకున్నారు. ఆయనే ఓ మంచి కథతో సినిమా చేద్దామని ప్రోత్సహించారు. అలా కుదిరిందే ‘ఊర్వశివో రాక్షసివో’. ప్రేమ, జీవితం, వృత్తి తదితర విషయాల్లో యువతరం ఎదుర్కొంటున్న సంఘర్షణ చుట్టూ సాగే కథ ఇది. ఇవే విషయాల్ని యువతరం చూసే కోణం వేరు, పెద్దలు చూసే కోణం వేరుగా ఉంటుంది. ఈ అంశాన్ని భిన్న మనస్తత్వాలున్న ఓ జంటతో ముడిపెట్టి తీసిన సినిమానే ఇది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా వినోదం మేళవించి చేసిన సినిమా ఇది. శ్రీకుమార్, సింధు పాత్రల్లో శిరీష్, అను ఇమ్మానుయేల్ కనిపిస్తారు. రొమాంటిక్ సన్నివేశాలైనా, కామెడీ అయినా... ప్రతిదీ కథలో భాగంగానే పుట్టింది. అదే ఈ సినిమా ప్రత్యేకత’’.
* ‘‘విభిన్నమైన కథలతో సినిమాలు చేయడమంటేనే ఇష్టం. నా దగ్గర రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి. ‘ఊర్వశివో రాక్షసివో’ కంటే ముందు కూడా యుద్ధం నేపథ్యంలో ఓ పీరియాడికల్ కథని తెరకెక్కించాలనుకున్నా. కానీ ముందు ఇదే చేయాల్సి వచ్చింది. అన్నీ కుదిరితే తదుపరి పీరియాడికల్ కథతోనే సినిమా చేస్తానేమో. కథానాయకులు, నిర్మాతలు, వాళ్ల అభిరుచులు... ఇలా ఇక్కడ అన్నీ కుదరాలి. అప్పుడే అనుకున్న సినిమాల్ని చేయగలుగుతాం. కేవలం నా కథలతోనే సినిమాలు చేయాలనుకోవడం లేదు. మంచి కథ అనుకున్నప్పుడు బయట కథలతోనూ సినిమా చేస్తా. ఆ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ చెప్పిన మాటలే స్ఫూర్తి. ‘ఒక మంచి కథని సరైన దర్శకుడు చేయకపోతే సమస్య అవుతుంది. ఎంత మంచి దర్శకుడైనా, సరైన కథ లేదంటే సమస్య అవుతుంది. కథ ఎంత ముఖ్యమో, దాన్ని డీల్ చేసే దర్శకుడు కూడా అంతే ముఖ్యం. కథల విషయంలో పరిమితులు పెట్టుకోవద్దు’ అని చెప్పారు ఒకసారి. ‘ఊర్వశివో రాక్షసివో’ విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. జీఏ2 సంస్థలో మరో సినిమా చేయాల్సి ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?