Bollywood: స్విట్జర్లాండ్కు... ప్రేమ్ కహానీ
కరణజోహార్ దర్శకత్వంలో రానున్న ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ తర్వాతి షెడ్యూల్ స్విట్జర్లాండ్లో జరగనుంది. హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రణ్వీర్ సింగ్, అలియా భట్లపై కొన్ని సన్నివేశాలతో పాటు
కరణజోహార్ దర్శకత్వంలో రానున్న ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ తర్వాతి షెడ్యూల్ స్విట్జర్లాండ్లో జరగనుంది. హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రణ్వీర్ సింగ్, అలియా భట్లపై కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. వారం పాటు ఉండనున్న ఈ షెడ్యూల్ మే లేదా జూన్ లో ఉంటుందని తెలుస్తోంది. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం చక్రబోర్తి సంగీతం అందిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్కడే హనీమూన్ : రణ్బీర్ కపూర్, అలియాలు ఈ నెలలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్కు అలియాతో పాటు రణబీర్ వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ జంట తమ హనీమూన్ ను స్విస్లోనే ప్లాన్ చేసుకుందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.