‘క్యాష్’లో రాఖీ స్పెషల్.. సందడి చేసిన అక్కా-తమ్ముళ్లు.. అన్నా-చెల్లెళ్లు..
ప్రతి పండగకు ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే ‘ఈటీవీ’ ఈసారి కూడా వినోదాల విందు ఇచ్చేందేందుకు సిద్ధమైంది. రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా ‘క్యాష్’ ఎంటర్టైన్మెంట్లో తగ్గేదేల్యా అంటోంది. రాఖీ సందర్భంగా ఈ కార్యక్రమంలో అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు సందడి చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి పండగకు ప్రేక్షకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించే ‘ఈటీవీ’ ఈసారి కూడా వినోదాల విందు ఇచ్చేందేందుకు సిద్ధమైంది. రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా ‘క్యాష్’ ఎంటర్టైన్మెంట్లో తగ్గేదేలే అంటోంది. రాఖీ సందర్భంగా ఈ కార్యక్రమంలో అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు సందడి చేయనున్నారు. డ్యాన్సర్ పండు, సింగర్ సాకేత్, బిగ్బాస్ ఫేమ్ జాఫర్, భానుశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూర్తి కార్యక్రమం వచ్చే శనివారం(21ఆగస్టు) రాత్రి 9.30గంటలకు ప్రసారం కానుంది.
వేదిక మీదకి వచ్చీరావడంతోనే తమ సోదరుల చేతికి రాఖీ కట్టారు. ‘నాకో కోరిక.. మీకు రాఖీ కట్టాలని ఉంది’ అని సుమను ఉద్దేశిస్తూ భానుశ్రీ సరదాగా అనగా.. మరి ‘నిన్ను బ్రదర్ అని పిలవాల్సి వస్తుంది’ అని సుమ కౌంటర్ ఇచ్చింది. సుమను ఇంటర్వ్యూ చేసేందుకు జాఫర్ పెద్ద ప్రశ్నల చిట్టా రాసుకొచ్చాడు. దాన్ని చూసిన సుమ షాకై.. ఇంత పెద్దగా ఉంది.. టాయిలెట్లో కూర్చొని రాశారా..? టిష్యూ పేపర్ మీద రాసుకొచ్చారు అని తనదైన స్టైల్లో పంచ్ వేయడంతో అందరూ పగలబడి నవ్వారు. సమయం దొరికినప్పుడల్లా పండు వెళ్లి సాకేత్ వాళ్ల సోదరికి, భానుశ్రీకి లైన్ వేస్తూ ఉండటం.. మధ్యలో సుమ కల్పించుకొని ‘హలో.. ఇది ఎవరి చెల్లెలితో వాళ్లు పాల్గొనే కార్యక్రమం.. వేరే వాళ్ల చెల్లెలితో పాల్గొనే కార్యక్రమం కాదు’ అంటూ సర్ది చెప్పి తన పోడియం దగ్గరికి పంపించడం.. ఇలా సరదాగా సాగింది. ఆ తర్వాత అమ్మాయిలతో రాఖీ తనకు కట్టించడంతో పండు పాపం బిక్కమొహం వేశాడు. ఆఖర్లో ఎమోషనల్ టచ్తో కార్యక్రమ ప్రోమో ఆకట్టుకునేలా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..