Ram Charan: అలా చేయలేకపోతే నేను ఏం సాధించనట్టే: రామ్చరణ్
రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ అమెరికాలో ప్రచారం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సినిమాకు సంబంధించి దర్శకుడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతే ఓ నటుడిగా తానేం సాధించనట్టే అని అభిప్రాయపడ్డారు ప్రముఖ హీరో రామ్చరణ్(Ram Charan). రాజమౌళి ‘నైస్’ అంటేనే పెద్ద ప్రశంస అని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చరణ్ ప్రముఖ షో ‘టాక్ ఈజీ’లో మాట్లాడారు. ఎన్టీఆర్ (NTR)తో కలిసి తాను నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లోని నాటు నాటు గీతం ఆస్కార్ (Oscar Awards 2023)కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన చరణ్ హాలీవుడ్ ఎంట్రీతోపాటు ఎన్నో విశేషాలు పంచుకున్నారు.
* మీరు, ఎన్టీఆర్ కలిసి నటించడం ఇండియన్ సినిమా చరిత్రలోనే అసాధారణమైన విషయం. మీరు కలిసి నటించేందుకు ఏ అంశం ప్రభావితం చేసింది?
రామ్చరణ్: దానికి ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళి. ఆయన ఏది చేసినా ప్రత్యేకమే. తన సినిమాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతాయి. ఆ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’లో మేం భాగంకావాలనుకున్నాం. నా బ్రదర్ తారక్తో కలిసి నటించడం కిక్ ఇచ్చింది. వేరే దర్శకుడితో అయితే ఇది సాధ్యంకాదేమో అనుకుంటున్నా. ఇద్దరు హీరోలేకాదు పదిమంది హీరోలు కలిసి తెరను పంచుకున్నా ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపునివ్వగలరు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్టు, అందులోని పాత్రలూ మేం కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేలా చేశాయి.
* చిత్రీకరణ ఎలా జరిగిందో చెబుతారా?
రామ్చరణ్: ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఆయన సెట్స్లో చాలా సరదాగా ఉంటారు. ఏదైనా షాట్ అద్భుతంగా వచ్చినపుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకునేవాళ్లం. ‘నైస్’ అనేదే ఆయన ఇచ్చే పెద్ద ప్రశంస. రాజమౌళినే కాదు ఏ దర్శకుడి మైండ్సెట్ను నేను అర్థంచేసుకోలేకపోతే ఓ నటుడిగా ఏం సాధించనట్టే. ‘ఆర్ఆర్ఆర్’లో నేను పోషించిన రామరాజు పాత్రలో పలు షేడ్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు బాగా దగ్గరైన క్యారెక్టర్ అది. పాండమిక్ వల్ల పదమూడు నెలలు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. లాక్డౌన్లో ఓ రోజు రాజమౌళి నాకు ఫోన్ చేయగానే ‘వావ్ నన్ను ఓ మనిషి గుర్తించారు’ అని సంబరపడ్డా. యోగక్షేమాల గురించి అడిగి, తారక్కు కాన్ఫరెన్స్ కాల్ చేశారు. తర్వాత, వర్చువల్ క్లాస్లు ఎలా జరుగుతున్నాయో కనుక్కుంటూ మాలో స్ఫూర్తినింపేవారు.
* ‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్లో షూట్ చేశారు కదా. ఆ విశేషాలు?
రామ్చరణ్: అదొక సర్ప్రైజ్. మేం అక్కడకు వెళ్లి ఆ పాటను షూట్ చేస్తామని అనుకోలేదు. మా విజ్ఞప్తిని అంగీకరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రెసిడెన్సియల్ ప్యాలెస్లో చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ఆ పాటకు డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడ్డాం. అందులోని కొన్ని స్టెప్పులకు టేకులు మీద టేకులు తీసుకోవాల్సి వచ్చింది. కీరవాణి అందించిన సంగీతం అద్భుతం. అప్పుడు మేం పడిన కష్టం వల్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఉక్రెయిన్ ప్రజలు చాలా మంచి వారు. అక్కడి ఆహారం అద్భుతంగా ఉంటుంది. మా చిత్రీకరణ పూర్తైన మూణ్నెళ్లకు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది. అలా జరగడం బాధాకరం.
* మీ తండ్రి చిరంజీవి ప్రభావం బాల్యంలో మీపై ఎలా ఉండేది?
రామ్చరణ్: నాన్నకు అభిమానులు ఇచ్చిన కానుకలుసహా సినిమాలకు సంబంధించిన మ్యాగజైన్లను ఇంట్లోకి తీసుకొచ్చేవారు కాదు. అవన్నీ ఆఫీసుకే పరిమితమయ్యేవి. ఇంట్లో గ్లామర్ ఫీల్డ్ వ్యక్తిగా, ఓ స్టార్గా కాకుండా సాధారణ వ్యక్తిగా ఉండేవారు. నేను ఏ స్కూల్లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవాణ్ని కాదు. అలా 8 స్కూల్స్, 3 కాలేజీలు మారా. ఆటల్లో చురుకుగా ఉండేవాణ్ని. దాంతో, పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చేవి. మ్యాథ్స్, హిస్టరీ సబ్జెక్ట్స్ నాకు బాగా ఇష్టం. నా ఫ్రెండ్ రానా (హీరో), నేను కంబైండ్ స్టడీస్ పేరుతో మా బాల్కనీలో కాసేపు ఉండి, ఆ తర్వాత అక్కడ నుంచి పక్కింటిలోని గార్డెన్లోకి జంప్ అయ్యేవాళ్లం.
* టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదం ఇప్పుడు లేనట్టేనా?
రామ్చరణ్: ఇండియాలోని ప్రతి రాష్ట్రం దేనికదే ప్రత్యేకం. ప్రాంతాన్ని బట్టి భాష, సంస్కృతి మారతాయి. ప్రతి రాష్ట్రంలో సినిమాలు రూపొందుతాయి. అయితే, ఉత్తరాది, దక్షిణాది అనే మాటను పోగొట్టి, ఇండియన్ సినిమా ఒక్కటే అని చాటిచెప్పేలా రాజమౌళి సహా మేమంతా కృషి చేస్తున్నాం. మేం బాలీవుడ్లోకి వెళ్లాలన్నా.. హిందీ దర్శకుడు దక్షిణాదిలో సినిమా చేయాలన్నా ఒకప్పుడు అసాధ్యమనిపించేది.
* ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు? విదేశీ చిత్రాల్లో నటించే అవకాశం ఉందా?
రామ్చరణ్: ‘టర్మినేటర్’, ‘గ్లాడియేటర్’, ‘బ్రేవ్హార్ట్’ తదితర హాలీవుడ్ చిత్రాలు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. నటుడిగా అన్ని దేశాల చిత్రాల్లో నటించాలనుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో నా హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్త వస్తుంది. జులియా రాబర్ట్స్ నా ఫేవరెట్ నటి. అతిథి పాత్రలోనైనా ఆమెతో కలిసి ఓ సినిమాలో నటించానుంది.
* మీరు చేపట్టే దీక్ష గురించి చెబుతారా?
రామ్చరణ్:15 సంవత్సరాల నుంచి నేను దీక్ష చేపడుతున్నా. దైవ చింతనే ప్రధానంగా జీవించేందుకు మేం అలా చేస్తుంటాం. 48 రోజుల వ్యవధి ఉండే దీక్షలో ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తాం. మాంసాహారం ముట్టుకోం. నేలపైనే పడుకోవాలి, చన్నీళ్ల స్నానమే చేయాలి. మహిళలను తాకకూడదు. ఎలాంటి లగ్జరీ లేకుండా బతకాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా మారేందుకు దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.