రామ్‌ ‘రెడ్‌’ ఓటీటీలో వచ్చేసింది!

రామ్‌ కథానాయకుడిగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రెడ్‌’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. తమిళ

Updated : 23 Feb 2021 14:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌ కథానాయకుడిగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రెడ్‌’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. తమిళ సూపర్‌హిట్‌ ‘తడమ్‌’ను ‘రెడ్‌’ పేరు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా రామ్‌ ద్విపాత్రాభినయం, కిషోర్‌ తిరుమల టేకింగ్‌ విమర్శకులను మెప్పించింది.

థియేటర్‌లలో సందడి ముగిసిన తర్వాత ఓటీటీ/టెలివిజన్‌లో ఎప్పుడు ప్రసారమవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘రెడ్‌’ను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్‌, సన్‌నెక్ట్స్‌ వేదికగా ‘రెడ్‌’ స్ట్రీమింగ్‌ అవుతోంది. తన నటనతో మరోసారి అభిమానులను ఖుషీ చేసిన రామ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఓటీటీ వేదికగా మరోసారి వీక్షించవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని